NiravModi పిటిషన్ కొట్టివేత..న్యూయార్క్ కోర్టు ఉత్తర్వులు

ABN , First Publish Date - 2021-10-19T18:35:02+05:30 IST

ప్రముఖ వజ్రాల వ్యాపారి నీరవ్ మోడీ అతని సహచరులపై మోసం ఆరోపణలను కొట్టివేయాలని కోరుతూ దాఖలైన పిటిషన్‌ను న్యూయార్క్‌లోని దివాలా కోర్టు కొట్టి వేసింది....

NiravModi పిటిషన్ కొట్టివేత..న్యూయార్క్ కోర్టు ఉత్తర్వులు

వాషింగ్టన్: ప్రముఖ వజ్రాల వ్యాపారి నీరవ్ మోడీ అతని సహచరులపై మోసం ఆరోపణలను కొట్టివేయాలని కోరుతూ దాఖలైన పిటిషన్‌ను న్యూయార్క్‌లోని దివాలా కోర్టు కొట్టి వేసింది. న్యూయార్క్ న్యాయస్థానం దక్షిణ జిల్లా న్యాయమూర్తి సీన్ హెచ్ లేన్ జారీ చేసిన ఉత్తర్వులు నీరవ్ మోడీకి విఘాతం కలిగించాయి. నీరవ్ మోడీ, బన్సాలీ, గాంధీ‌లు వేసిన పిటిషన్‌ను న్యూయార్క్  కోర్టు తిరస్కరించింది.నీరవ్ మోడీ పంజాబ్ నేషనల్ బ్యాంకు, ఇతరులను బిలియన్ల మేర మోసం చేయడం ద్వారా స్టాక్ ధరను  తప్పుగా పెంచి లాభాలను తన సొంత కంపెనీలోకి పంపించాడని భారతీయ అమెరికన్ న్యాయవాది రవి బాత్రా చెప్పారు.


2011 నుంచి 2018వరకు నీరవ్ మోడీ అతని సహచరులు పంజాబ్ నేషనల్ బ్యాంకు నుంచి రుణాలు తీసుకొని మోసం చేశారని కోర్టు పేర్కొంది. పంజాబ్ నేషనల్ బ్యాంకును నీరవ్ మోడీ మోసగించాడని దీనివల్ల బ్యాంకుకు బిలియన్ల మేర నష్టం జరిగిందని న్యాయమూర్తి తన ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. 


Updated Date - 2021-10-19T18:35:02+05:30 IST