అమెరికాలో 94వేలకు చేరువైన కరోనా మరణాలు
ABN , First Publish Date - 2020-05-21T02:43:08+05:30 IST
అగ్రరాజ్యం అమెరికాలో కరోనా మహమ్మారి కరాళ నృత్యం చేస్తోంది.
వాషింగ్టన్: అగ్రరాజ్యం అమెరికాలో కరోనా మహమ్మారి కరాళ నృత్యం చేస్తోంది. ఇక్కడ కొత్తగా 3వేల కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో యూఎస్లో మొత్తం నమోదైన కరోనా కేసుల సంఖ్య 15,73,777కు చేరింది. అలాగే గడిచిన 24గంటల్లో 1,700పైగా కరోనా మరణాలు సంభవించాయి. దీంతో ఇక్కడ కరోనా కారణంగా మరణించిన వారి సంఖ్య 93,705కు చేరింది. అమెరికా తర్వాత బ్రిటన్లో అత్యధిక కరోనా మరణాలు సంభవిచాయి. అయితే ఈ రెండు దేశాల కరోనా మరణాల సంఖ్యలో దాదాపు 60వేలు వ్యత్యాసం ఉండటం గమనార్హం.