భారత విద్యార్థులకు గుడ్న్యూస్ !
ABN , First Publish Date - 2020-08-15T20:28:18+05:30 IST
అమెరికాలో చదువుకోవాలనుకునే భారత విద్యార్థులకు గుడ్న్యూస్.
న్యూఢిల్లీ: అమెరికాలో చదువుకోవాలనుకునే భారత విద్యార్థులకు గుడ్న్యూస్. మహమ్మారి కరోనా వైరస్ నేపథ్యంలో ఆగిపోయిన విద్యార్థుల యూఎస్ వీసా ప్రక్రియను ఆగస్టు 17 నుంచి ప్రారంభిస్తున్నట్లు శుక్రవారం ఢిల్లీలోని అమెరికన్ ఎంబసీ ప్రకటించింది. దేశంలోని ముంబై, చెన్నై, హైదరాబాద్, కోల్కతా, ఢిల్లీ కాన్సులేట్లలో సోమవారం నుంచి విద్యార్థి, అకడమిక్ ఎక్స్ఛేంజ్ విజిటర్ వీసా దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభం అవుతుందని ఎంబసీ పేర్కొంది. అయితే, ప్రస్తుత కరోనా విపత్కర పరిస్థితుల దృష్ట్యా పరిమిత సంఖ్యలో మాత్రమే విద్యార్థులకు వీసాలు జారీ చేయనున్నట్లు అమెరికన్ కాన్సులేట్ స్పష్టం చేసింది.