అజిత్ దోవల్‌ను కలిసిన అమెరికా స్టేట్ సెక్రటరీ

ABN , First Publish Date - 2021-07-29T05:54:45+05:30 IST

అగ్రరాజ్యం అమెరికా సెక్రటరీ ఆఫ్ స్టేట్ ఆంటొనీ బ్లింకెన్.. భారత జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్‌ను కలిశారు.

అజిత్ దోవల్‌ను కలిసిన అమెరికా స్టేట్ సెక్రటరీ

వాషింగ్టన్: అగ్రరాజ్యం అమెరికా సెక్రటరీ ఆఫ్ స్టేట్ ఆంటొనీ బ్లింకెన్.. భారత జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్‌ను కలిశారు. ఢిల్లీకి వచ్చిన ఆయన దోవల్‌తో సుమారు గంటపాటు భేటీ అయ్యారు. బుధవారం నాడు ఈ సమావేశం జరిగింది. ఈ క్రమంలో అఫ్ఘానిస్తాన్ పరిస్థితుల గురించి వీరి మధ్య చర్చ జరిగిందని సమాచారం. అలాగే దక్షిణ చైనా సముద్రం, ఇండో-పసిఫిక్ ప్రాంతంలో చైనా కవ్వింపు చర్యల గురించి కూడా బ్లింకెన్ ప్రస్తావించినట్లు తెలుస్తోంది. తాలిబన్ దాడులు ఎక్కువగా జరుగుతున్న తరుణంలో అఫ్ఘానిస్తాన్ పరిస్థితులను అదుపులోకి తీసుకురావడానికి అనుసరించాల్సిన మార్గాలపై దోవల్, బ్లింకెన్ మాట్లాడుకున్నారు. అలాగే భారత్-చైనా సరిహద్దుల అంశంపై కూడా చర్చలు జరిగాయి.

Updated Date - 2021-07-29T05:54:45+05:30 IST