వ్యాక్సినేషన్‌లో కీలక మైలురాయిని చేరుకున్న అమెరికా!

ABN , First Publish Date - 2021-02-26T23:01:30+05:30 IST

అగ్రరాజ్యం అమెరికాలో వ్యాక్సినేషన్ ప్రక్రియ చురుకుగా సాగుతోంది. ఈ క్రమంలో అమెరికా కీలక మైలురాయిని చేరుకుంది. 50 మిలియన్ల మందికి కొవిడ్ వ్యాక్సిన్‌ను అందించినట్టు అమెరికా ప్రకటించిం

వ్యాక్సినేషన్‌లో కీలక మైలురాయిని చేరుకున్న అమెరికా!

వాషింగ్టన్: అగ్రరాజ్యం అమెరికాలో వ్యాక్సినేషన్ ప్రక్రియ చురుకుగా సాగుతోంది. ఈ క్రమంలో అమెరికా కీలక మైలురాయిని చేరుకుంది. 50 మిలియన్ల మందికి కొవిడ్ వ్యాక్సిన్‌ను అందించినట్టు అమెరికా ప్రకటించింది. కాగా.. అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన తొలిరోజు నుంచే మహమ్మారిని వ్యాప్తిని అరికట్టడానికి చర్యలు తీసుకుంటానని ప్రమాణ స్వీకారానికి ముందు జో బైడెన్ ప్రకటించారు. అగ్రరాజ్య అధినేతగా బాధ్యతలు స్వీకరించిన ఆయన.. తొలి వంద రోజుల్లోనే 100 మిలియన్ల మందికి వ్యాక్సిన్‌ను అందించడాన్ని లక్ష్యంగా పెట్టుకుని ఆ దిశగా చర్యలు ప్రారంభించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో అమెరికా అధ్యక్షుడిగా బైడెన్ ప్రమాణ స్వీకారం చేసిన 37 రోజుల్లోనే వ్యాక్సినేషన్ ప్రక్రియలో అగ్రరాజ్యం కీలక మైలురాయిని చేరుకుంది. 



ఈ నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ స్పందించారు. 50 మిలియన్ల మందికి వ్యాక్సిన్ అందడం పట్ల ఆయన సంతోషం వ్యక్తం చేశారు. అయితే ఇది విశ్రాంతి తీసుకోవాల్సిన సమయం కాదని బైడెన్ హెచ్చరించారు. భౌతిక దూరం పాటించడం, మాస్కులను ధరించడం వంటి నిబంధనలను కచ్చితంగా పాటించాలని కోరారు. చాలా మంది అమెరికన్లు వీటన్నిటినీ పాటిస్తున్నారు. అందువల్లే కరోనాపై పోరాటంలో మెరుగైన స్థానానికి చేరుకుంటున్నాం. తొందరలోనే మహమ్మారిపై విజయం సాధించబోతున్నాం’ అని అన్నారు. అంతేకాకుండా తొలి వంద రోజుల్లో 100 మిలియన్ల మందికి వ్యాక్సిన్‌ను అందించాలనే లక్ష్యాన్ని నిర్దేశించుకున్న సమయంలో చాలా మంది తనను విమర్శించారని ఈ సందర్భంగా బైడెన్ గుర్తు చేశారు. అయితే తాను మాత్రం దీన్ని చిన్న లక్ష్యంగానే భావించానని పేర్కొన్నారు. ఇదిలా ఉంటే.. అమెరికాలో ఇప్పటి వరకు 2.84కోట్ల మంది మహమ్మారి బారినపడ్డగా.. 5.08లక్షల మంది కరోనా కాటుకు బలయ్యారు.  


Updated Date - 2021-02-26T23:01:30+05:30 IST