హాట్టాపిక్గా పూసపాటి వంశీయుల పంచాయితీ
ABN , First Publish Date - 2020-10-28T16:32:55+05:30 IST
పైడితల్లి సిరిమానోత్సవంలో పూసపాటి వంశీయుల పంచాయితీ హాట్టాపిక్గా మారింది.
విజయనగరం: పైడితల్లి సిరిమానోత్సవంలో పూసపాటి వంశీయుల పంచాయితీ హాట్టాపిక్గా మారింది. కోట బురుజుపై కూర్చోవడానికి మాన్సాస్ ఛైర్మన్, ఆనందగజపతిరాజు మొదటి భార్య కుమార్తె సంచయిత పేచీ పెట్టారు. ముందుగా వచ్చిన ఆనందగజపతిరాజు రెండో భార్య సుధ, ఆమె కుమార్తె ఊర్మిళ కోటపై కూర్చున్నారు. అయితే ఆ ఇద్దరిని కోట నుంచి దింపాలని పోలీసులపై సంచయిత రుస రుసలాడారు. అయితే కోట నుంచి కిందికి వెళ్లమని తాము చెప్పలేమంటూ పోలీసులు ఆమెకు తేల్చి చెప్పారు. దీంతో సంచయిత కోటకు మరోవైపు కుర్చీ వేసుకుని కూర్చొని ఉత్సవాన్ని తిలకించారు. అయితే సంచయిత తీరుకు నిరసనగా ఆనందగజపతి రాజు రెండవ భార్య సుధ, ఊర్మిళ దీక్షకు సిద్ధమయ్యారు. ఆనందగజపతిరాజుకు నిజమైన వారసురాలిని తానేనని చెప్పారు.