ఎన్పీఏలపై ఉర్జిత్ పటేల్ పుస్తకం
ABN , First Publish Date - 2020-07-06T06:10:01+05:30 IST
ఆర్బీఐ మరో మాజీ గవర్నర్ ఉర్జిత్ పటేల్ కూడా పుస్తక రచనలో పడ్డారు. ‘ఓవర్డ్రాఫ్ట్. సేవింగ్ ది ఇండియన్ సేవర్’ పేరుతో ఆయన రాసిన పుస్తకం ఈ నెలాఖర్లో మార్కెట్లో విడుదల కానుంది...
ముంబై: ఆర్బీఐ మరో మాజీ గవర్నర్ ఉర్జిత్ పటేల్ కూడా పుస్తక రచనలో పడ్డారు. ‘ఓవర్డ్రాఫ్ట్. సేవింగ్ ది ఇండియన్ సేవర్’ పేరుతో ఆయన రాసిన పుస్తకం ఈ నెలాఖర్లో మార్కెట్లో విడుదల కానుంది. ప్రముఖ ప్రచురణ సంస్థ హార్పర్ కోలిన్స్ ఇండియా ఈ పుస్తకాన్ని ప్రచురిస్తోంది. ప్రస్తుతం భారత బ్యాంకింగ్ వ్యవస్థకు పెద్ద సమస్యగా మారిన మొండి బకాయిలు, అందుకు కారణాలు, ఆర్బీఐ గవర్నర్గా వాటి కట్టడికి పటేల్ చేసిన కృషి.... ఈ పుస్తకంలో ప్రధాన అంశాలని ప్రచురణ సంస్థ పేర్కొంది. నీతి నియమాలు లేని పారిశ్రామిక, వ్యాపార దిగ్గజాల నుంచి బ్యాంకుల్లో డిపాజిటర్ల కష్టార్జిత పొదుపు సొమ్మును కాపాడేందుకు పటేల్ తీసుకున్న చర్యలనూ ఈ పుస్తకంలో పొందుపరిచారు.
పెద్ద నోట్ల రద్దు సమయంలో ఉర్జిత్ పటేల్ ఆర్బీఐ గవర్నర్గా ఉన్నారు. ఆర్బీఐ మిగులు నిధులను ప్రభుత్వాని బదిలీ చేసే విషయంలో ప్రభుత్వంతో విభేదాలు తలెత్తడంతో పటేల్ ఆర్బీఐ గవర్నర్ పదవి నుంచి డిసెంబరు, 2018లో అర్థాంతరంగా తప్పుకున్నారు.