‘పట్టణ ప్రగతి’ పనులు పూర్తిచేయాలి

ABN , First Publish Date - 2022-05-21T06:18:28+05:30 IST

జిల్లావ్యాప్తంగా ప్రభుత్వం చేపడుతు న్న ‘పట్టణప్రగతి’ పనులు సత్వరమే పూర్తిచేయాలని కలెక్టర్‌ టి.వినయ్‌కృష్ణారెడ్డిఆదేశించారు.

‘పట్టణ ప్రగతి’ పనులు పూర్తిచేయాలి

కలెక్టర్‌ టి.వినయ్‌కృష్ణారెడ్డి 

సూర్యాపేట(కలెక్టరేట్‌), మే 20: జిల్లావ్యాప్తంగా ప్రభుత్వం చేపడుతు న్న ‘పట్టణప్రగతి’ పనులు సత్వరమే పూర్తిచేయాలని కలెక్టర్‌ టి.వినయ్‌కృష్ణారెడ్డిఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్‌లో పట్టణ ప్రగతిపై నిర్వహించిన సమావేశంలో అదనపు కలెక్టర్‌ హేమంత్‌ కేశవ్‌పాటిల్‌తో కలిసి పాల్గొని మాట్లాడా రు. మునిసిపాలిటీల్లో నిర్మిస్తున్న వెజ్‌,నాన్‌వెజ్‌ ఇంటిగ్రేటెడ్‌ మార్కెట్‌ నిర్మాణ పనులను వెంటనే పూర్తిచేయాలన్నారు. జిల్లావ్యాప్తంగా చేపడుతన్న 47వైకుంఠధామాల్లో 19పూర్తికాగా, మిగిలిన 28వైకుంఠధామాల పనులు పురోగతిలో ఉన్నాయన్నారు. నేరేడుచర్లలో మరుగుదొడ్ల పనులు సకాలంలో పూర్తిచేయకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో కమిషనర్లు సత్యనారాయణరెడ్డి, మహేశ్వర్‌రెడ్డి, శ్రీనివాసరావు, మెప్మా పీడీ రమేష్‌ పాల్గొన్నారు.


ఉప ఎన్నికలకు ఏర్పాట్లు : కలెక్టర్‌ 

జిల్లాలో ఖాళీగా ఉన్న స్థానాలకు ఉప ఎన్నికలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేసినట్లు కలెక్టర్‌ వినయ్‌కృష్ణారెడ్డి తెలిపారు. కలెక్టరేట్‌లో వివిధ పార్టీల ప్రజాప్రతినిధులతో నిర్వహించిన సమావేశంలో మాట్లాడారు. జిల్లాలో నాలుగు సర్పంచ్‌, రెండు ఎంపీటీసీ, 227 వార్డు సభ్యుల స్థానాల ఎన్నికలకు 253 పోలింగ్‌ కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఈ నెల 24న పోలింగ్‌ కేంద్రాల తుదిజాబితా విడుదల చేస్తామన్నారు. కార్యక్రమంలో జడ్పీ సీఈవో సురేష్‌, డీపీవో యాదయ్య, పార్టీల నాయకులు పాల్గొన్నారు. 

Updated Date - 2022-05-21T06:18:28+05:30 IST