ఈనెల 20 నుంచి ‘పట్టణ ప్రగతి’
ABN , First Publish Date - 2022-05-18T05:53:30+05:30 IST
ఈనెల 20 నుంచి ‘పట్టణ ప్రగతి’
- మునిసిపల్ చైర్పర్సన్ మంజులా రమేష్
వికారాబాద్, మే 17 : ఐటీ మంత్రి కేటీఆర్ ఆదేశాల మేరకు ఈ నెల 20నుంచి జూన్ 5వరకు 4వ విడత పట్టణ ప్రగతి కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుందని మునిసిపల్ చైర్పర్సన్ మంజులా రమేష్ అన్నారు. మంగళవారం 4వ విడత పట్టణ ప్రగతి కార్యాచరణపై కౌన్సిల్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పట్టణ ప్రగతి కార్యక్రమానికి కేటాయించిన రూ.34 లక్షల బడ్జెట్ ఏజెండాను ఏకగ్రీవంగా ఆమోదించారు. అనంతరం చైర్పర్సన్ మాట్లాడుతూ పట్టణ ప్రగతి కార్యక్రమాన్ని వంద శాతం విజయవంతం చేసి వికారాబాద్ పట్టణాన్ని సుందరంగా తీర్చిదిద్దడమే కాకుండా పట్టణ ప్రగతి అవార్డు సైతం అందుకునేలా కృషి చేయాలని పిలుపునిచ్చారు. కౌన్సిల్ సమావేశం అనంతరం తెలంగాణ మునిసిపల్ చాంబర్ వైస్ చైర్మన్గా బాధ్యతలు స్వీకరించిన చైర్పర్సన్ మంజులా రమే్షను కౌన్సిల్ సభ్యులు శాలువాలతో సన్మానించారు. ఈ కార్యక్రమంలో వైస్చైర్మన్ శంషాద్బేగం, కౌన్సిలర్లు, కో-ఆప్షన్ సభ్యులు, కమిషనర్ శరత్చంద్ర, మునిసిపల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.