కువైత్లో ఉప్పుటూరు వాసి మృతి
ABN , First Publish Date - 2021-03-08T04:48:47+05:30 IST
కువైత్లో ఎస్.వెంకటాపురం ఉప్పుటూరు కాలనీ వాసి కొమ్మ భూషయ్య (45) శుక్రవారం గుండెపోటుతో మృతి చెందినట్లు కుటుంబీకులకు సమా చారం అందింది.
అట్లూరు, మార్చి 7: కువైత్లో ఎస్.వెంకటాపురం ఉప్పుటూరు కాలనీ వాసి కొమ్మ భూషయ్య (45) శుక్రవారం గుండెపోటుతో మృతి చెందినట్లు కుటుంబీకులకు సమా చారం అందింది. కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల మేరకు... అట్లూరు మండలం ఎస్. వెంకటాపురం వాసి భూషయ్య బతుకుదెరువు కోసం మూడేళ్ల కిందట కువైత్కు వెళ్లాడు. అక్కడ దినసరి కూలీగా పని చేస్తూ ఇంటికి డబ్బు పంపిస్తున్నాడు. భార్య విమలమ్మ, కుమారుడు, కుమార్తెతో కలిసి గ్రామంలో ఉంటున్నారు. కాగా కువైత్ నుంచి ఆదివారం వచ్చిన సమాచారం మేరకు భూషయ్య ఛాతిలో నొప్పి రావడంతో ఆయన ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. పరిశీలించగా అతను చనిపోయినట్లు ధృవీకరిస్తూ కుటుంబీకులకు సమాచారాన్ని చేరవేశారు. దీంతో ఎస్.వెంకటాపురంలోని ఉప్పుటూరు కాలనీలో విషాదం చోటు చేసుకుంది. మృతదేహం ఆదివారం రాత్రికి సొంత ఊరు చేరుకుంటుందని గ్రామస్తులు తెలిపారు.