శ్రీవారిని దర్శించుకున్న ‘ఉప్పెన’ చిత్ర బృందం

ABN , First Publish Date - 2021-02-28T08:32:23+05:30 IST

తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామిని ‘ఉప్పెన’ చిత్ర యూనిట్‌ శనివారం దర్శించుకుంది.

శ్రీవారిని దర్శించుకున్న ‘ఉప్పెన’ చిత్ర బృందం
ఉప్పెన చిత్ర బృందం

  తిరుమల, ఫిబ్రవరి27(ఆంధ్రజ్యోతి): తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామిని ‘ఉప్పెన’ చిత్ర యూనిట్‌ శనివారం దర్శించుకుంది. ఉప్పెన సినిమా విజయోత్సవంలో భాగంగా హీరో వైష్ణవ్‌ తేజ్‌, హీరోయిన్‌ కృతి శెట్టి, దర్శ కుడు బుచ్చిబాబు, నిర్మాత నవీన్‌ శుక్రవారం రాత్రి కాలినడకన తిరుమలకు వచ్చిన విషయం తెలిసిందే. ఈ మేరకు శనివారం ఉదయం వీఐపీ బ్రేక్‌ సమయంలో వారు చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డితో కలిసి  వెళ్లి శ్రీవారిని దర్శించుకున్నారు.  వీరికి ఆలయ అధికారులు ప్రత్యేక దర్శనం కల్పించి లడ్డూప్రసాదాలు అందజేశారు. దర్శనం తర్వాత దర్శకుడు బుచ్చి బాబు ఆలయం వెలుపల మీడియాతో మాట్లాడుతూ.. ఉప్పెన చిత్రం షూటింగ్‌ ముందు కథను శ్రీవారి పాదాల చెంత ఉంచి మొక్కుకున్నట్టు తెలిపారు. మంచి విజయాన్ని అందించిన స్వామికి కృతజ్ఞతలు తెలిపానన్నారు. తర్వాత సినిమాకు సంబంధించిన కథను కూడా స్వామి వద్ద ఉంచి పూజ చేయించానని, స్వామి ఆశీస్సులు ఉంటే ఆ చిత్రం కూడా మంచి విజయం సాధిస్తుందన్నారు. 

Updated Date - 2021-02-28T08:32:23+05:30 IST