అయ్యయ్యో వద్దమ్మా.. శరత్పై దాడి కేసులో తాజా అప్డేట్..
ABN , First Publish Date - 2021-10-22T14:13:37+05:30 IST
‘‘అయ్యయ్యో వద్దమ్మా’’ అంటూ ఓవర్ నైట్లో సోషల్ మీడియా స్టార్ అయిపోయిన డాన్సర్ శరత్ అందరికీ తెలుసు.....
హైదరాబాద్ సిటీ/రాంగోపాల్పేట్ : కేఎఫ్సీ వద్ద యూట్యూబర్ శరత్పై దాడి చేసిన డి.నాగసాయి, డి.హరికృష్ణ, జె.రోహిత్, ఎన్.జయంత్కు కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. ప్యారడైజ్ వద్ద అర్ధరాత్రి వరకు టిఫిన్ బండి నడుపుతున్న నల్లగుట్ట గైసుద్దీన్బాగ్కు చెందిన డి. రాజు, ఎస్డీ రోడ్డు నివాసి డి. మురళి, ఎంజీ రోడ్డులో స్టార్ హోటల్ నిర్వహిస్తున్న ఎండీ ఇమ్రాన్కు కోర్టు మూడు రోజుల జైలు శిక్ష విధించింది.
కాగా.. ‘‘అయ్యయ్యో వద్దమ్మా’’ అంటూ ఓవర్ నైట్లో సోషల్ మీడియా స్టార్ అయిపోయిన డాన్సర్ శరత్ అందరికీ తెలుసు. ఇన్స్టా, ఫేస్బుక్ ఇలా ఏ సోషల్ మీడియా అకౌంట్ చూసినా అతని డాన్సు.. అతని మాటలే వినిపించాయి. ఎంత ఫేమస్ అయిపోయాడంటే ఒకప్పుడు తన వీడియోస్ను వైరల్ చేయండి అని వేడుకున్న శరత్.. ఇప్పుడు మీమర్స్ అందరికీ అతనొక సబ్జెక్ట్ అయిపోయాడు. అంత ఫేమస్ అయ్యింది మాత్రం అయ్యయ్యో వద్దమ్మా అనే యాడ్తోనే. కానీ, ఇప్పుడు ఆ యాడే అతనికి పెద్ద తలనొప్పి తెచ్చిపెట్టినట్లు తెలుస్తోంది. శరత్పై ఆదివారం రాత్రి గుర్తుతెలియని వ్యక్తులు విచక్షణ రహితంగా దాడి చేశారు. ఈ క్రమంలో అతడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితులను అరెస్ట్ చేశారు. తాజాగా కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది.