పెరిగిన ఉష్ణోగ్రతలు
ABN , First Publish Date - 2020-03-27T07:35:16+05:30 IST
బంగాళాఖాతంలో వారం, పది రోజుల నుంచి కొనసాగుతున్న అధికపీడనం బలహీనపడింది. దీంతో కోస్తా, రాయలసీమలో పొడి వాతావరణం...
విశాఖపట్నం, మార్చి 26 (ఆంధ్రజ్యోతి): బంగాళాఖాతంలో వారం, పది రోజుల నుంచి కొనసాగుతున్న అధికపీడనం బలహీనపడింది. దీంతో కోస్తా, రాయలసీమలో పొడి వాతావరణం నెలకొంది. పగటి ఉష్ణోగ్రతలు సాధారణం కంటే ఒకటి నుంచి మూడు డిగ్రీలు ఎక్కువగా నమోదయ్యాయి. కర్నూలులో 39 డిగ్రీలు నమోదైంది. రానున్న రెండు రోజుల వరకు కోస్తా, రాయలసీమలో పొడి వాతావరణం నెలకొంటుందని వాతావరణ నిపుణుడొకరు తెలిపారు. ఇంకా ఎండ తీవ్రత కొనసాగి ఉష్ణోగ్రతలు స్వల్పంగా పెరిగే అవకాశం వుందని పేర్కొన్నారు. రెండు రోజుల తరువాత కోస్తాలో వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు.