ప్రధాని మోదీతో ఉపాసన సమావేశం

ABN , First Publish Date - 2021-12-23T01:53:08+05:30 IST

ఇండియన్ ఎక్స్‌పో 2020లో భాగంగా గౌరవనీయులైన ప్రధానమంత్రి నరేంద్రమోదీని కలుసుకున్నాను. ఆవిష్కరణ, ఆరోగ్య సంరక్షణను మరింత మెరుగుపర్చడం, మహిళా సాధికారత, సంస్కృతీ పరిరక్షణ మీద ప్రధానంగా దృష్టిసారించడం..

ప్రధాని మోదీతో ఉపాసన సమావేశం

న్యూఢిల్లీ: ప్రధానమంత్రి నరేంద్రమోదీతో అపోలో ఫౌండేషన్ వైస్ చైర్‌పర్సన్ కొనిదెల ఉపాసన సమావేశమయ్యారు. ఇండియన్ ఎక్స్‌పో 2020 లో భాగంగా మోదీతో ఆమె సమావేశం జరిగింది. ఈ సమావేశానికి సంబంధించిన ఫొటోను, ఇతర విషయాన్ని ఆమె తన సోషల్ మీడియా ఖాతా ద్వారా నెటిజెన్లతో పంచుకున్నారు.


‘‘ఇండియన్ ఎక్స్‌పో 2020లో భాగంగా గౌరవనీయులైన ప్రధానమంత్రి నరేంద్రమోదీని కలుసుకున్నాను. ఆవిష్కరణ, ఆరోగ్య సంరక్షణను మరింత మెరుగుపర్చడం, మహిళా సాధికారత, సంస్కృతీ పరిరక్షణ మీద ప్రధానంగా దృష్టిసారించడం అనేవి అద్భుతమైన అంశాలు. అలాగే సాంకేతికత శక్తి మనకు ఎన్నో అవకాశాన్ని ఇస్తుంది. మనం దానిని తెలివిగా ఉపయోగించుకోవాలి’’ అని ఉపాసన ట్వీట్ చేశారు. ఈ ట్వీట్‌లోనే ‘దుబాయ్ ఎక్స్‌పో 2020’ని కూడా ట్యాగ్ చేశారు. ఈ ట్వీట్‌లో ప్రధాని మోదీతో సమావేశం సందర్భంగా తీసుకున్న ఫొటోను షేర్ చేశారు.

Updated Date - 2021-12-23T01:53:08+05:30 IST