ఉపాధి పనుల పరిశీలన

ABN , First Publish Date - 2022-01-23T03:37:40+05:30 IST

మండలంలో ఉపాధి హామీ పథకం కింద చేపట్టిన వివిధ అభివృద్ధి పనులను జేసీ గణేష్‌ శనివారం పరిశీలించారు.

ఉపాధి పనుల పరిశీలన
ఉపాధిహామీ పనులను పరిశీలిస్తున్న జేసీ గణేష్‌

డక్కిలి, జనవరి 22 : మండలంలో ఉపాధి హామీ పథకం కింద చేపట్టిన వివిధ అభివృద్ధి పనులను  జేసీ గణేష్‌ శనివారం పరిశీలించారు. సంగనపల్లిలో అవెన్యూ ప్లాంటేషన్‌ను పరిశీలించారు. మొక్కలు ఎండిపోకుండా కాపాడాలని సిబ్బందికి సూచించారు.  వెంపటివారిపల్లిలో నిమ్మ మొక్కలను పరిశీలించారు. రైతులు ఉద్యానపంటల సాగుపై దృష్టిపెట్టాలన్నారు. మోపూరువెల్లంపల్లిలో సాలిడ్‌మేనేజ్‌మెంటు పథకం తీరుతెన్నులను అక్కడి సిబ్బందిని అడిగి తెలుసుకొన్నారు. అనంతరం డక్కిలి హైస్కూల్లో మధ్యాహ్న భోజన పథకాన్ని పరిశీలించారు. ప్రభుత్వం కల్పిస్తున్న వసతులను సద్వినియోగం చేసుకొని ఉన్నత లక్ష్యాలను సాధించాలని విద్యార్థులకు సూచించారు.  సోమవారం నుంచి ఉపాధిహామీ పనులు ప్రారంభించాలని, జాబ్‌కార్డు ఉన్న ప్రతి ఒక్కరికి పని కల్పించాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ఏపీడీ కాంతారావు, ఎంపీడీవో వసుంధర, ఏపీవో ల క్ష్మినారాయణ, ఈసీ తిరుపతి రావు తదితరులు పాల్గొన్నారు.


Updated Date - 2022-01-23T03:37:40+05:30 IST