బాత్రూంకు వెళ్లేందుకు వేచి ఉన్న మహిళ.. మరో బాత్రూంకు వెళ్లండంటూ తాళాలు ఇచ్చిన రైల్వేస్టేషన్ స్వీపర్.. చివరకు
ABN , First Publish Date - 2022-03-20T22:25:18+05:30 IST
కాలకృత్యాలు తీర్చుకునేందుకు ఆ మహిళ మరుగుదొడ్డికి వెళ్లింది. అక్కడ జనం రద్దీగా ఉండడంతో నిరాశగా ఉన్న ఆమె వద్దకు వెళ్లి.. ‘‘పక్కన మరో బాత్రూం ఉంది మేడమ్! వెళ్లండి’’.. అంటూ..
ఇంటి నుంచి బయటికి వెళ్లిన మహిళ.. క్షేమంగా తిరిగి వస్తుందన్న నమ్మకం లేని రోజులివి. ఎటువైపు నుంచి ఎవరు దాడి చేస్తారో తెలీని పరిస్థితి నెలకొంది. ఒంటిరిగా కనిపిస్తే చాలు.. దాడులు చేయడం, ప్రతిఘటిస్తే ప్రాణాలు తీయడం నిత్యకృత్యమైంది. రోజూ ఎక్కడో చోట ఇలాంటి వార్తలు వింటూనే ఉన్నాం. తాజాగా ఉత్తరప్రదేశ్లోని రైల్వే స్టేషన్లో ఓ మహిళకు ఇలాంటి అనుభవమే ఎదురైంది. వెయిటింగ్ హాల్లో వేచి ఉన్న మహిళను గమనిస్తున్న స్వీపర్, అతని సోదరుడు అదును కోసం వేచి చూస్తున్నారు. అదే సమయంలో కాలకృత్యాలు తీర్చుకునేందుకు ఆ మహిళ మరుగుదొడ్డికి వెళ్లింది. అక్కడ జనం రద్దీగా ఉండడంతో నిరాశగా ఉన్న ఆమె వద్దకు వెళ్లి.. ‘‘పక్కన మరో బాత్రూం ఉంది మేడమ్! వెళ్లండి’’.. అంటూ తాళాలు ఇచ్చిన స్వీపర్, అతడి సోదరుడు.. చివరకు చేసిన నిర్వాకం తీవ్ర సంచలనం కలిగించింది..
అది ఉత్తరప్రదేశ్ ప్రతాప్ఘర్ రైల్వే స్టేషన్. ఈ నెల 19న స్టేషన్ మొత్తం ప్రయాణిలతో రద్దీగా ఉంది. అదే సమయంలో అహ్మదాబాద్ వెళ్లేందుకు ఓ వ్యక్తి తన భార్యతో కలిసి స్టేషన్కి వచ్చారు. రైలు వచ్చేందుకు సమయం ఉండడంతో భార్యను వెయింటింగ్ హాల్లో కూర్చోబెట్టి, తినుబండారాలు తెచ్చేందుకు వెళ్లాడు. అంతకుముందు నుంచే మహిళను ఓ స్వీపర్, అతని సోదరుడు గమనిస్తూ ఉన్నారు. కొంతసేపటి తర్వాత కాలకృత్యాలు తీర్చుకునేందుకు ఆ మహిళ బాత్రూంకి వెళ్లింది. అయితే ఆ మరుగుదొడ్డి వద్ద జనాలు ఎక్కువగా ఉండడంతో నిరాశగా వెనుదిరిగింది. అదే సమయంలో స్వీపర్ అక్కడికి వెళ్లి, ఆమెతో తనకు తాను స్వీపర్గా పరిచయం చేసుకున్నాడు. ‘‘మేడమ్! పక్కనే మరో మరుగుదొడ్డి ఉంది.. వెళ్లండి మేడం’’.. అంటూ తన వద్ద ఉన్న తాళాలను ఇచ్చాడు. అతడి మాటలు నమ్మిన మహిళ తాళాలు తీసుకుని ఖాళీగా ఉన్న బాత్రూంలోకి వెళ్లింది.
‘‘గుడ్ టచ్, బ్యాడ్ టచ్’’పై క్లాసులో చెబుతుండగా.. పైకి లేచిన బాలిక.. తండ్రి, సోదరుడు, తాత, మామ గురించి ఆమె చెప్పింది విని..
ఆమె లోపలికి వెళ్లిన కొద్దిసేపటికి... స్వీపర్ సోదరుడు కూడా లోపలికి ప్రవేశించాడు. అతన్ని చూడగానే ఆమె ఒక్కసారిగా షాక్ అయింది. షాక్ నుంచి తేరుకునే లోపే ఆమె నోరు మూసి, బలాత్కారం చేశాడు. దీంతో సదరు మహిళ అపస్మారక స్థితిలోకి వెళ్లింది. అప్పటికే ఆమె కేకలు విన్న కొందరు ప్రయాణికులు అక్కడికి చేరుకున్నారు. దీంతో నిందితులు అక్కడి నుంచి పరారయ్యారు. భార్య కోసం వెతుకుతూ ఉన్న భర్త.. కొద్ది సేపటికి అక్కడికి వచ్చాడు. భార్య జరిగిన విషయం తెలియజేయండంతో... ఇద్దరూ కలిసి రైల్వే పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. నిందితుల కోసం గాలిస్తున్నారు. రద్దీగా ఉండే రైల్వే స్టేషన్లో పట్టపగలు జరిగిన ఈ దారుణం సంచలనం కలిగించింది.