యూపీలో యువతి అదృశ్యం..లవ్ జిహాద్ కేసు నమోదు

ABN , First Publish Date - 2021-01-15T13:05:49+05:30 IST

కళాశాలకు వెళ్లిన యువతి తిరిగి ఇంటికి రాకపోవడంతో పోలీసులు లవ్ జిహాద్ అంటూ మతమార్పిడి చట్టం కింద కేసు నమోదు చేసిన ఘటన....

యూపీలో యువతి అదృశ్యం..లవ్ జిహాద్ కేసు నమోదు

గోరఖ్‌పూర్ (ఉత్తరప్రదేశ్): కళాశాలకు వెళ్లిన యువతి తిరిగి ఇంటికి రాకపోవడంతో పోలీసులు లవ్ జిహాద్ అంటూ మతమార్పిడి చట్టం కింద కేసు నమోదు చేసిన ఘటన ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని గోరఖ్‌పూర్ నగరంలో జరిగింది. తన కుమార్తె సోషల్ మీడియా స్నేహితుడు  తన మతాన్ని దాచి ఆమెతో స్నేహం చేసి కిడ్నాప్ చేశాడని యువతి తండ్రి గోరఖ్‌పూర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. జనవరి 5వతేదీన యువతి కళాశాలకు వెళ్లి తిరిగి రాలేదని గోరఖ్‌పూర్ నగరంలోని చిలువాటల్ పోలీసు స్టేషన్ హౌస్ ఆఫీసర్ నీరజ్ కుమార్ రాయ్ చెప్పారు. తాము కేసు నమోదు చేసి దర్యాప్తు చేయగా యువతి మెహబూబ్ అనే కర్ణాటక యువకుడితో ఫోనులో పలుసార్లు మాట్లాడినట్లు కాల్ రికార్డుల ద్వారా తేలింది. దీంతో యువతి కోసం ప్రత్యేక పోలీసు బృందాన్ని కర్ణాటక రాష్ట్రానికి పంపించినట్లు రాయ్ చెప్పారు. యువతిని కిడ్నాప్ చేసి తీసుకువెళ్లిన కర్ణాటక యువకుడు మెహబూబ్ పై యూపీ ప్రభుత్వ కొత్త మత మార్పిడి వ్యతిరేక చట్టంతో పాటు కిడ్నాప్ కేసులు నమోదు చేశామని పోలీసులు వివరించారు.

Updated Date - 2021-01-15T13:05:49+05:30 IST