మంచంపై పడుక్కున్న యువకుడు.. హఠాత్తుగా అక్కడకు వచ్చిన యువతి.. కత్తితో అతని ప్రైవేట్ పార్ట్ కోసేసి..

ABN , First Publish Date - 2022-02-25T22:24:06+05:30 IST

ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్‌లో బావామరదళ్ల మధ్య సరసం వికటించింది. అప్పటివరకు మాట్లాడుకున్న ఇద్దరూ గొడవకు దిగారు

మంచంపై పడుక్కున్న యువకుడు.. హఠాత్తుగా అక్కడకు వచ్చిన యువతి.. కత్తితో అతని ప్రైవేట్ పార్ట్ కోసేసి..

ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్‌లో బావామరదళ్ల మధ్య సరసం వికటించింది. అప్పటివరకు మాట్లాడుకున్న ఇద్దరూ గొడవకు దిగారు. దీంతో ఆగ్రహించిన మరదలు బావ జననాంగాన్ని కత్తితో కోసేసింది. ఆ మహిళ చేతిని బావ కోసేశాడు. ప్రస్తుతం ఇద్దరూ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఒకరిపై మరొకరు పోలీసులకు ఫిర్యాదు చేశారు. విషయం తెలుసుకున్న పోలీసులు షాకయ్యారు. 


కాన్పూర్‌లోని బిల్హౌర్ కొత్వాలి ప్రాంతానికి చెందిన బాధితుడు శుక్రవారం ఉదయం మంచంపై పడుక్కున్నాడు. అక్కడకి అతని మరదలు వచ్చింది. ఇద్దరూ కాసేపు మాట్లాడుకున్నారు. అనంతరం ఆ యువతి పదునైన ఆయుధంతో బావ జననాంగాన్ని కోసేసింది. ఇద్దరి మధ్య జరిగిన గొడవలో ఆమె చెయ్యి కూడా తెగిపోయింది. స్థానికులు వెంటనే ఇద్దరినీ ఆస్పత్రికి తరలించారు. ఇద్దరూ ఒకరిపై మరొకరు పోలీసులకు ఫిర్యాదు చేశారు. 


అతను తనను ఎప్పట్నుంచో వేధిస్తున్నాడని, అతనికి బుద్ధి చెప్పేందుకే అలా చేశానని యువతి పోలీసులకు చెప్పింది. కాగా, తన కొడుకుపై అకారణంగా ఆమె దాడి చేసిందని, ఆమెపై తగిన చర్యలు తీసుకోవాలని నిందితుడి తల్లి పోలీసులకు విజ్ఞప్తి చేసింది. 


  


Updated Date - 2022-02-25T22:24:06+05:30 IST