కేజీబీవీ ప్రవేశాలకు 20వరకు దరఖాస్తులు

ABN , First Publish Date - 2020-08-09T11:09:53+05:30 IST

కస్తూర్బాగాంధీ బాలికా విద్యాలయాల్లో (కేజీ బీవీ) 7,8 తరగతులు, ఇంటర్మీడియట్‌ ప్రథమ సంవత్సరంలో మిగిలిపోయిన సీట్లను భర్తీ చేసేందుకు ..

కేజీబీవీ ప్రవేశాలకు 20వరకు దరఖాస్తులు

ఒంగోలువిద్య, ఆగస్టు 8: కస్తూర్బాగాంధీ బాలికా విద్యాలయాల్లో (కేజీ బీవీ) 7,8 తరగతులు, ఇంటర్మీడియట్‌ ప్రథమ సంవత్సరంలో మిగిలిపోయిన సీట్లను భర్తీ చేసేందుకు ఈనెల 20వ తేదీ వరకు దరఖాస్తులను ఆహ్వా నిస్తున్నట్లు ఏపీ సమగ్రశిక్ష జిల్లా అదనపు ప్రాజెక్టు కోఆర్డినేటర్‌ డాక్టర్‌ ఎం. శ్రీనివాసరెడ్డి శనివారం ప్రకటనలో తెలిపారు. దరఖాస్తులు ఆన్‌లైన్‌లో సమ ర్పించాలన్నారు. పేద, అనాథ, బడిబయట పిల్లలు, మధ్యలో చదువు మానేసి డ్రాప్‌అవుట్‌లుగా మిగిలిన బాలికలు మాత్రమే దరఖాస్తు చేసుకోవాలని సూ చించారు. దరఖాస్తులు వెబ్‌సైట్‌ ద్వారా పొందవచ్చని, ఎంపికైన బాలికలకు సెల్‌ఫోన్‌ మెసేజ్‌ ద్వారా విషయం తెలియజేస్తామని వెల్లడించారు.

Updated Date - 2020-08-09T11:09:53+05:30 IST