ఆడో మగో తెలియాలని.. భార్య కడుపు నిలువునా చీల్చి..!

ABN , First Publish Date - 2020-09-20T17:50:10+05:30 IST

ఘోరం.. ఒళ్లు జలదరించే..మనుషుల మీద నమ్మకం పోయే దారుణమొకటి ఉత్తరప్రదేశ్‌లో జరిగింది. ఇప్పిటకే ఐదుగురు ఆడపిల్లలకు తండ్రైన ఓ వ్యక్తి కడుపుతూ ఉన్న తన భార్యపై ఎవ్వరూ ఊహించని దారుణానికి ఒడిగట్టాడు. గర్భంతో ఉన్న భార్య కడుపును కత్తితో నిలువుగా చీల్చేశాడు. బడోవ్ జిల్లాలో శనివారం రాత్రి ఈ దారుణం జరిగింది.

ఆడో మగో తెలియాలని.. భార్య కడుపు నిలువునా చీల్చి..!

లక్నో: ఘోరం.. ఒళ్లు జలదరించే..మనుషుల మీద నమ్మకం పోయే దారుణమొకటి ఉత్తరప్రదేశ్‌లో జరిగింది. ఇప్పటికే ఐదుగురు ఆడపిల్లలకు తండ్రైన ఓ వ్యక్తి  కడుపుతూ ఉన్న తన భార్యపై ఎవ్వరూ ఊహించని దారుణానికి ఒడిగట్టాడు. గర్భంతో ఉన్న భార్య కడుపును కత్తితో నిలువుగా చీల్చేశాడు. బడోవ్ జిల్లాలో శనివారం రాత్రి ఈ దారుణం జరిగింది. 


‘పన్నాలాల్ అనే వ్యక్తి గర్భవతి అయిన తన భార్య కడుపును చీల్చేశాడు’ అని సీనియర్ పోలీస్ అధికారి ప్రవీన్ సింగ్ చౌహాన్ మీడియాతో తెలిపారు. అతడిని అదుపులోకి తీసుకున్నామని, కేసు నమోదు చేశామని ఆయన పేర్కొన్నారు. ఇంతటి దారుణానికి ఒడిగట్టటానికి కారణమేమిటో తెలుసుకునేందుకు పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. బాధితురాలు ఏడు నెలల గర్భవతి అని వారు తెలిపారు. ప్రస్తుతం ఆమె బరేలీ ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. 


‘పన్నాలాల్‌కు ఎప్పటినుంచీ తనకో కొడుకు కావాలని కోరుకుంటున్నాడు. పుట్టబోయే బిడ్డ ఆడో మగో తెలుసుకునేందుకే ఈ దారుణానికి ఒడిగట్టాడు’ అని బాధితురాలి తరఫు బంధువులు ఆరోపించారు.

Updated Date - 2020-09-20T17:50:10+05:30 IST