‘నన్ను కాల్చకండి’ అంటూ ప్లకార్డుతో వచ్చిన దొంగ... పోలీసుస్టేషనులో Surrender
ABN , First Publish Date - 2022-05-18T13:13:12+05:30 IST
ఓ దోపిడీ దొంగ ‘‘నన్ను కాల్చకండి’’ అంటూ ప్లకార్టు మెడలో వేలాడదీసుకొని పోలీసుస్టేషనుకు వచ్చి లొంగిపోయిన విచిత్ర ఘటన...
బుదౌన్ (ఉత్తరప్రదేశ్): ఓ దోపిడీ దొంగ ‘‘నన్ను కాల్చకండి’’ అంటూ ప్లకార్టు మెడలో వేలాడదీసుకొని పోలీసుస్టేషనుకు వచ్చి లొంగిపోయిన విచిత్ర ఘటన ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో తాజాగా జరిగింది. యూపీకి చెందిన పుర్కాన్ అలియాస్ సదువా తన అనుచరుడు కమర్తో కలిసి ఏప్రిల్ 5వతేదీన ఓ వ్యాపారి నుంచి రూ.5లక్షలు దోచుకున్నాడు. ‘‘నన్ను కాల్చకండి, పోలీసుల భయంతో లొంగిపోతున్నాను’’ అని రాసి ఉన్న ప్లకార్డును దోపిడీ దొంగ పుర్కాన్ మెడలో వేసుకొని అనుచరుడు కమర్తో కలిసి ఫైజ్గంజ్లోని బెహతా పోలీస్ స్టేషన్కు వచ్చి లొంగిపోయాడని బుదౌన్ పోలీసు సూపరింటెండెంట్ ఓపీ సింగ్ చెప్పారు.
దోపిడీ ఘటన తర్వాత కమర్ను పోలీసులు పట్టుకోగా, ఫుర్కాన్ తప్పించుకోగలిగాడని ఎస్పీ చెప్పారు.దోపిడీ చేసిన మొత్తంలో రూ.25వేల మొత్తాన్ని కూడా ఫుక్రాన్ నుంచి స్వాధీనం చేసుకున్నట్లు ఎస్పీ తెలిపారు.నిందితుడు ఫుర్కాన్ను అరెస్టు చేసినందుకు 25వేల రివార్డు కూడా ఉందని జిల్లా పోలీసు చీఫ్ వివరించారు.