యూపీ మాజీ సీఎం అఖిలేష్ యాదవ్కు కరోనా పాజిటివ్
ABN , First Publish Date - 2021-04-14T16:24:57+05:30 IST
దేశంలో కరోనా వైరస్ విలయతాండవం చేస్తోంది.
లక్నో: దేశంలో కరోనా వైరస్ విలయతాండవం చేస్తోంది. కరోనా కేసులు రోజురోజుకు కొత్త రికార్డులను నమోదు చేస్తున్నాయి. ఈ నేపధ్యంలో ఈరోజు నుంచి మహారాష్ట్రలో 15 రోజుల పాటు జనతా కర్ఫ్యూ విధిస్తున్నారు. ఇదేవిధంగా మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్లోనూ జనతా కర్ఫ్యూ విధించారు. దీంతో భోపాల్లో దుకాణాలన్నీ మూతపడ్డాయి. రోడ్లు నిర్మానుష్యంగా మారాయి. ఇదిలావుండగా యూపీ మాజీ సీఎం అఖిలేష్ యాదవ్ కరోనా బారిపడి, ప్రస్తుతం చికిత్స పొందుతున్నారు.