ములాయం ఇంట్లో యూపీ ఎన్నికల వేడి... వరుస భేటీలు!

ABN , First Publish Date - 2021-08-10T11:40:33+05:30 IST

దేశ రాజకీయాల్లో ఈమధ్య నేతల భేటీలు ముమ్మురంగా సాగుతున్నాయి.

ములాయం ఇంట్లో యూపీ ఎన్నికల వేడి... వరుస భేటీలు!

న్యూఢిల్లీ: దేశ రాజకీయాల్లో ఈమధ్య నేతల భేటీలు ముమ్మురంగా సాగుతున్నాయి. కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ విపక్షాల నేతలను తరచూ కలుసుకుంటూ మంతనాలు సాగిస్తున్నారు. ఇదేసమయంలో సమాజ్‌వాదీ పార్టీ సంరక్షుడు ములాయం సింగ్ యాదవ్ కూడా 2022 యూపీ ఎన్నికలకు ముందుగా యాక్టివ్ మోడ్‌లోకి వచ్చినట్లు కనిపిస్తున్నారు. ఆయన ఢిల్లీలోని తన నివాసంలో తరచూ పలువురు నేతలతో భేటీలు నిర్వహిస్తున్నారు. 


సమాజ్‌వాదీ పార్టీ వ్యవస్థాపకుడు ములాయంసింగ్ యాదవ్ ఇంటికి రాష్ట్రీయ జనతాదళ్(ఆర్జేడీ) జాతీయ అధ్యక్షుడు లాలూ ప్రసాద్ యాదవ్ రాగా, ఇరువురూ మంతనాలు సాగించారు. తరువాత హరియాణా మాజీ ముఖ్యమంత్రి, ఇండియనే నేషనల్ లోక్‌దళ్(ఐఎన్ఎల్డీ) అధ్యక్షుడు ఓం ప్రకాశ్ చౌతాలా కూడా ములాయం ఇంటికి వచ్చి ఆయనతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా చౌతాలా మాట్లాడుతూ ములాయం యోగక్షేమాలు తెలుసుకునేందుకే వచ్చానని తెలిపారు. యూపీ ఎన్నికల గురించి కూడా చర్చించామన్నారు. కాగా పశ్చిమ యూపీలో జాట్ ఓటర్లు నిర్ణయాత్మక పాత్ర పోషిస్తున్నారు. ఓం ప్రకాష్ చౌతాలాకు వీరి మధ్య మంచి ఆదరణ ఉందని చెబుతుంటారు.

Updated Date - 2021-08-10T11:40:33+05:30 IST