యూపీలో వ్యాక్సినేషన్: కాన్పూర్లో, ఆగ్రాలో ఎవరికి ఇచ్చారంటే...
ABN , First Publish Date - 2021-01-16T17:56:53+05:30 IST
ఉత్తరప్రదేశ్లో కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియ ప్రారంభమైంది. ప్రధాని వర్చువల్...
లక్నో: ఉత్తరప్రదేశ్లో కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియ ప్రారంభమైంది. ప్రధాని వర్చువల్ ప్రసంగం అనంతరం ఈ కార్యక్రమం మొదలైంది. యూపీలో తొలి టీకాను కాన్పూర్ లోని సీహెచ్సీలో పారిశుద్ధ్య కార్మికుడు కులదీప్కు వేశారు. యూపీ రాజధాని లక్నోలో డాక్టర్ మనోజ్ శుక్లాకు టీకా వేశారు. గోరఖ్పూర్లోనూ కరోనా టీకాలు వేసే ప్రక్రియ ప్రారంభమైంది. ఆగ్రాలోని ఎత్మాద్ పూర్ పీహెచ్సీలో సచిన్ గుప్తాకు తొలి టీకా వేశారు. అలాగే ఆగ్రాలోని ఎన్ఎన్ మెడికల్ కాలేజీలో ముందుగా డాక్టర్ అనుపమ్ శర్మ టీకా వేయించుకున్నారు.