కూరగాయల మార్కెట్లో పోలీసుల దారుణం.. వాహనాలతో తొక్కించి..

ABN , First Publish Date - 2020-06-06T03:20:41+05:30 IST

ఉత్తరప్రదేశ్‌లోని ఓ ఎస్సై దారుణంగా ప్రవర్తించాడు. కూరగాయల మార్కెట్లోకి వాహనాలతో వచ్చి

కూరగాయల మార్కెట్లో పోలీసుల దారుణం.. వాహనాలతో తొక్కించి..

ప్రయాగ్‌రాజ్: ఉత్తరప్రదేశ్‌లోని ఓ ఎస్సై దారుణంగా ప్రవర్తించాడు. కూరగాయల మార్కెట్లోకి వాహనాలతో వచ్చి నేలపై ఉన్న కూరగాయలు, పండ్లను తొక్కించి పిప్పి చేశాడు. అంతటితో ఆగక వాహనాలను రివర్స్ చేసి మిగిలిపోయిన వాటిని కూడా తొక్కించి పారేశాడు. ఇందుకు సంబంధించి వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఉత్తరప్రదేశ్ పోలీస్ చీఫ్ సత్యార్థ్ అనిరుధ్ పంకజ్ తీవ్రంగా పరిగణించారు. ఎస్సైని సస్పెండ్ చేయడమే కాకుండా ప్రయాగ్‌రాజ్  జిల్లా నుంచి బదిలీ చేశారు. మార్కెట్లో పోలీసులు వ్యవహరించిన తీరు బాధాకరమని పంకజ్ ఆవేదన వ్యక్తం చేశారు.


ఘూర్పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఓ కూరగాయల మార్కెట్లో పోలీసుల దారుణ చర్యకు సంబంధించి రెండు వీడియోలు వైరల్ అయ్యాయి. మొదటి వీడియోలో ఓ పోలీసు జీపు మితిమీరిన వేగంతో రావడం కనిపించింది. కూరగాయలను కప్పుకోవాలంటూ రైతులు అరవడం వీడియోలో స్పష్టంగా వినిపిస్తోంది. రెండో వీడియోలో నేలపై ఉన్న కూరగాయలను జీపుతో తొక్కించి పిప్పి చేయడం కనిపించింది. అంతేకాదు, వాహనాన్ని రివర్స్ తీసుకుని మిగిలిపోయిన పండ్లు, కూరగాయలను కూడా తొక్కించారు. సామాజిక దూరాన్ని పాటించకపోవడం వల్లే పోలీసులు ఇలా చేశారని తెలుస్తోంది.  

Updated Date - 2020-06-06T03:20:41+05:30 IST