అమిత్‌ షాతో యూపీ సీఎం భేటీ

ABN , First Publish Date - 2021-06-11T07:52:26+05:30 IST

ఉత్తరప్రదేశ్‌ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ కేంద్ర హోం మంత్రి అమిత్‌ షాతో గురువారం ఢిల్లీలో భేటీ అయ్యారు. పార్టీలో అసమ్మతులు, కొవిడ్‌ నిర్వహణలో కొన్ని వర్గాలు యోగి ప్రభుత్వంపై...

అమిత్‌ షాతో యూపీ సీఎం భేటీ

  • నేడు ప్రధానిని కలవనున్న యోగి

న్యూఢిల్లీ/ముంబై, జూన్‌ 10: ఉత్తరప్రదేశ్‌ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ కేంద్ర హోం మంత్రి అమిత్‌ షాతో గురువారం ఢిల్లీలో భేటీ అయ్యారు. పార్టీలో అసమ్మతులు, కొవిడ్‌ నిర్వహణలో కొన్ని వర్గాలు యోగి ప్రభుత్వంపై విమర్శలు చేసిన నేపథ్యంలో ఈ భేటీ జరిగినట్లు సమాచారం. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డాను కూడా యోగి శుక్రవారం కలవనున్నారు. ఉత్తరప్రదేశ్‌లో అగ్రవర్ణానికి చెం దిన కాంగ్రెస్‌ నేత జితిన్‌ ప్రసాద బుధవారం బీజేపీలో చేరిన తర్వాత పార్టీ అగ్రనేతలను ఆయన కలవడం ప్రాధాన్యం సంతరించుకుంది. కొవిడ్‌ నిర్వహణలో యోగి ప్రభుత్వంపై సొంత ఎంపీలు, ఎమ్మెల్యేలు విమర్శలు చేసిన నేపథ్యంలో అగ్రనేతలతో ఆయన సమావేశమైనట్లు సమాచారం.


Updated Date - 2021-06-11T07:52:26+05:30 IST