మమతది రాక్షస సంస్కృతి

ABN , First Publish Date - 2021-01-25T07:33:26+05:30 IST

బెంగాల్‌ సీఎం మమతా బెనర్జీపై బీజేపీ నేతలు విరుచుకుపడుతున్నారు. శనివారం జరిగిన బోస్‌ జయంతి కార్యక్రమంలో

మమతది రాక్షస సంస్కృతి

యూపీ బీజేపీ ఎమ్మెల్యే వ్యాఖ్యలు


కోల్‌కతా, జనవరి24: బెంగాల్‌ సీఎం మమతా బెనర్జీపై బీజేపీ నేతలు విరుచుకుపడుతున్నారు. శనివారం జరిగిన బోస్‌ జయంతి కార్యక్రమంలో జై శ్రీరాం నినాదాలను మమత తప్పుబట్టడంపై మండిపడుతున్నారు. ఆమె రాక్షస సంస్కృతికి చెందినవారని ఉత్తరప్రదేశ్‌ బీజేపీ ఎమ్మెల్యే సురేంద్ర సింగ్‌ వ్యాఖ్యానించారు. మరోవైపు..  రాష్ట్రంలోని  70శాతం ప్రజల మనోభావాలను ఆమె దెబ్బతీశారని బీజేపీ సీనియర్‌ నేత కైలాశ్‌ విజయ వర్గీయ అన్నారు. హిందూ వ్యతిరేక విధానాన్ని మమత మరోసారి బయటపెట్టుకున్నారని వీహెచ్‌పీ ఆరోపించింది. భారీ కోతుల గుంపులో ఏకైక సింహంలా మమత నిలబడ్డారని తృణమూల్‌ ఎంపీ మహు మోయిత్రా అన్నారు. కాగా, నేతాజీని కాంగ్రెస్‌ హత్యచేసిందని బీజేపీ ఎంపీ సాక్షి మహారాజ్‌ ఆరోపించారు. నేతాజీ పాపులారిటీ ముందు గాంధీగానీ, నెహ్రూ కానీ నిలవలేరని ఆయన అన్నారు. స్వాతంత్య్ర ఉద్యమంలో బోస్‌ కీలక పాత్ర పోషించారన్నారు.

Updated Date - 2021-01-25T07:33:26+05:30 IST