యూపీలో తొలి కరోనా మృతి... 103 కు చేరిన కేసులు

ABN , First Publish Date - 2020-04-01T16:47:24+05:30 IST

యూపీలో కరోనా వైరస్ కారణంగా ఒక యువకుడు మరణించాడు. బస్తీ జిల్లాకు చెందిన ఈ యువకుడు గోరఖ్‌పూర్‌లోని మెడికల్ కాలేజీలో చికిత్స పొందాడు.

యూపీలో తొలి కరోనా మృతి... 103 కు చేరిన కేసులు

లక్నో: యూపీలో కరోనా వైరస్ కారణంగా ఒక యువకుడు మరణించాడు. బస్తీ జిల్లాకు చెందిన ఈ యువకుడు గోరఖ్‌పూర్‌లోని మెడికల్ కాలేజీలో చికిత్స పొందాడు. యుపిలో కరోనా బారిన పడిన రోగుల సంఖ్య 103కు చేరుకుంది. మంగళవారం చివరి నాటికి మరో ఏడు కొత్త కేసులు నమోదయ్యాయి. ఇందులో బరేలీ నుండి ఐదుగురు, నోయిడా, ఘజియాబాద్ నుండి ఒక్కక్క రోగి ఉన్నారు. ఇప్పటివరకు నోయిడాలో గరిష్టంగా 39 కేసులు నమోదయ్యాయి. మరోవైపు 261 అనుమానిత రోగులను ఆసుపత్రిలో చేర్చారు. ఇప్పటివరకు యూపీలోని 15 జిల్లాల్లో కరోనా వైరస్ వ్యాపించింది. యూపీలోని నోయిడాలో ఇప్పటివరకు నమోదైన 39 మంది కేసులలో  ఎక్కువ మంది సీస్ ఫైర్ అనే ప్రైవేట్ సంస్థ ఉద్యోగులుగా గుర్తించారు. 

Updated Date - 2020-04-01T16:47:24+05:30 IST