రాష్ట్రంలో అశాంతి

ABN , First Publish Date - 2022-05-20T05:26:15+05:30 IST

రాష్ట్రంలో అశాంతి నెలకొందని టీడీపీ నియోజకవర్గ ఇన్‌చార్జ్‌ ఎంఎం కొండయ్య ధ్వజమెత్తారు.

రాష్ట్రంలో అశాంతి
బాదుడే బాదుడు కార్యక్రమంలో ఎంఎం కొండయ్య తదితరులు

వైసీపీ ప్రభుత్వం అన్నింటా విఫలం

టీడీపీ నియోజకవర్గ ఇన్‌చార్జ్‌ కొండయ్య ధ్వజం

వేటపాలెం(చీరాల), మే 19: రాష్ట్రంలో అశాంతి నెలకొందని టీడీపీ నియోజకవర్గ ఇన్‌చార్జ్‌ ఎంఎం కొండయ్య ధ్వజమెత్తారు. ప్రభుత్వ అ సమర్ధ విధానాలకు వ్యతిరేకంగా సాగిస్తున్న బాదుడే, బాదుడు కార్య క్రమం గురువారం రాత్రి మండల పరిఽధిలోని పాపాయిపాలెంలో జరి గింది. టీడీపీ శ్రేణులతో కలసి కొండయ్య ఇంటింటికి తిరుగుతూ ప్ర భుత్వ వైఫల్యాలను ఎండగడుతూ వారి మద్దతు కోరుతూ ప్రచారం నిర్వహించారు. స్థానికంగా ఉన్న దేవాలయాల్లో ప్రత్యేక పూజలు చే శారు. గ్రామస్థులు కొండయ్యను సాదరంగా స్వాగతించారు. ఈ సంద ర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం అన్నింటా విఫలమైందన్నారు.   అన్నివర్గాల ప్రజలు అశాంతితో ఉన్నారు. వైసీపీ ప్రభుత్వానికి చరమగీతం పాడటానికి సిద్ధంగా ఉన్నారని చెప్పారు. కార్యక్రమంలో టీడీపీ నాయకులు కౌతవరపు జనార్దన్‌, బొగ్గుల పార్ధసారధి, పులి వెంకట్రావు, కొమ్మనబోయిన రజని, హరికృష్ణ, పూర్ణ, శివనాగమల్లేశ్వరరావు, నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.


ప్రజలగోడు పట్టని పాలకులు

పంగులూరు, మే 19: ప్రజల గోడు పాలకులకు పట్టడంలేదని టీ డీపీ నాయకులు ధ్వజమెత్తారు. మండలంలోని అలవలపాడు గ్రామం లో గురువారం సాయంత్రం టీడీపీ ఆధ్వర్యంలో బాదుడే బాదుడు కా ర్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా ఆపార్టీ నాయకులు మాట్లాడు తూ పెరిగిన ధరలతో అన్నివర్గాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతు న్నారన్నారు. కార్యక్రమంలో టీడీపీ మండల అధ్యక్షుడు రావూరి రమే ష్‌, మాజీ జడ్పీటీసీ కేవీ సుబ్బారావు, కుక్కపల్లి ఏడుకొండలు, చింతల సహదేవుడు, మస్తాన్‌వలి, కోమటి ప్రసాదు, బెల్లంకొండ దశరధ, గుర్రం ఆదిశేఖర్‌, నార్నె సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2022-05-20T05:26:15+05:30 IST