ప్రజా సమస్యలపై అలుపెరుగని పోరాటం

ABN , First Publish Date - 2022-08-15T04:56:46+05:30 IST

ప్రజా సమస్యలపై అలుపెరుగని పోరాటం కొనసాగిస్తామని సీ పీఐ జిల్లా కార్యవర్గ సభ్యుడు సుబ్బారెడ్డి, ఏఐటీయూసీ జిల్లా ఉపాధ్యక్షుడు చాంద్‌బా షా, సీపీఐ మండల కార్యదర్శి మనోహర్‌ బాబు తెలిపారు.

ప్రజా సమస్యలపై అలుపెరుగని పోరాటం
సీపీఐ జండాను ఆవిష్కరిస్తున్న సీపీఐ నాయకులు

కొండాపురం, ఆగస్టు 14: ప్రజా సమస్యలపై అలుపెరుగని పోరాటం కొనసాగిస్తామని సీ పీఐ జిల్లా కార్యవర్గ సభ్యుడు సుబ్బారెడ్డి, ఏఐటీయూసీ జిల్లా ఉపాధ్యక్షుడు చాంద్‌బా షా, సీపీఐ మండల కార్యదర్శి మనోహర్‌ బాబు తెలిపారు. స్థానిక సీపీఐ కార్యాలయం లో 3వ మండల మహాసభలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పార్టీ జెండా ను ఆవిష్కరించిన అనంతరం వారు మాటా ్లడుతూ ప్రజాసమస్యలే ఆయుధంగా సీపీఐ  పోరాడుతోందన్నారు. గండికోట నిర్వాసితుల్లో అర్హులందరికీ పరిహారం చెల్లించి, పునరావా సం కల్పించాలని, మొదటి విడత 14 గ్రామా ల వారికి రూ.3.25లక్షల పరిహారాన్ని చెల్లించా లని వారు డిమాండ్‌ చేశారు. కొండాపురం రైల్వేస్టేషన్‌లో   రైళ్ల స్టాపింగ్‌ను పునరుద్ధరిం చాలని డిమాండ్‌ చేశారు. ముంపుననకు గురికాని గ్రామాలకు ఒక ఎత్తిపోతల పథ కాన్ని ఏర్పాటు చేయాలని డిమాండ్‌ చేశారు.  కార్యక్రమంలో విద్యాసాగర్‌ రెడ్డి, వెంకట రమణ, జయంత్‌, రామయ్య, చార్లెస్‌, జ్యోతి, సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు.

 నూతన కార్యవర్గం ఎన్నిక

 సీపీఐ మండల కార్యదర్శిగా మనోహర్‌బాబు, సహాయ కార్యదర్శులుగా జయంత్‌, వెంకట రమణ, కోశాదికారిగా విద్యాసాగర్‌రెడ్డి, కమిటీ మెంబర్లుగా రామయ్య, చార్లెస్‌, రాధా, పద్మావతి, జ్యోతి తదితరులను ఎన్నుకు న్నారు.


Updated Date - 2022-08-15T04:56:46+05:30 IST