గుర్తు తెలియని వాహనం ఢీకొని యువకుడు మృతి

ABN , First Publish Date - 2021-04-13T05:47:57+05:30 IST

గుర్తు తెలియని వాహనం ఢీ కొట్టడంతో మోటార్‌బైక్‌పై ప్రయాణిస్తున్న యువకుడు మృతి చెందాడు. ఈ సంఘంటన త్రోవగుంట సమీపంలో కల్వరి చర్చి వద్ద జాతీయరాహదారిపై సోమవారం జరిగింది.ఈ ప్రమాదంలో స్థానిక ప్రగ తికాలనీ కి చెందిన కుంభా సాయికృష్ణ(27) మృతి చెందాడు.

గుర్తు తెలియని వాహనం ఢీకొని యువకుడు మృతి
మృతి చెందిన కుంభా సాయికృష్ణ(27)


ఒంగోలు(క్రైం), ఏప్రిల్‌ 12: గుర్తు తెలియని వాహనం ఢీ కొట్టడంతో మోటార్‌బైక్‌పై ప్రయాణిస్తున్న యువకుడు మృతి చెందాడు. ఈ సంఘంటన త్రోవగుంట సమీపంలో కల్వరి చర్చి వద్ద జాతీయరాహదారిపై సోమవారం జరిగింది.ఈ ప్రమాదంలో స్థానిక ప్రగ తికాలనీ కి చెందిన కుంభా సాయికృష్ణ(27) మృతి చెందాడు. ఒంగోలు నుంచి సాయికృష్ణ గుండ్లాపల్లి వైపు మోటార్‌ బైక్‌పై వెళుతుండగా గుర్తు తెలియని వాహనం వెనుక నుంచి ఢీకొంది. ఈ ప్రమాదంలో సాయికృష్ణ  కింద పడిపోగా వాహనం అయన తలపైనుంచి వెళ్లింది. దీంతో సాయికృష్ణ అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడు గుళ్ళాపల్లి గ్రోత్‌సెంటర్‌ లో ప్రయివేట్‌ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు. సాయికృష్ణ తండ్రి కోటయ్య ఒంగోలు ట్రాఫిక్‌ పోలీస్‌ స్టేషన్‌లో ఎస్సైగా పనిచేస్తున్నారు. మృతుడు సాయికృష్ణకు ఏడాది క్రితం వివాహం అయింది. సంఘటనా స్థలాన్ని తాలుకా ఎస్సై సోమశేఖర్‌ పరిశీలించారు.అయితే ప్రమాదానికి కారణమైన వాహనం గురించి తెలియాల్సి ఉందని అయా ప్రాంతంలో ఉన్న సీసీ పుటేజిని పరిశీలిస్తున్నామని ఎస్సై తెలిపారు.


Updated Date - 2021-04-13T05:47:57+05:30 IST