రైలు ఢీకొని గుర్తు తెలియని వ్యక్తి మృతి
ABN , First Publish Date - 2020-11-30T06:43:27+05:30 IST
ఇక్కడి లక్ష్మీదేవిపేట రైల్వేగేటు సమీపంలో ఆదివారం తెల్లవారుజామున రైలు ఢీకొని గుర్తు తెలియని వ్యక్తి మృతి చెందినట్టు జీఆర్పీ దువ్వాడ ఎస్ఐ భుజంగరావు తెలిపారు.
అనకాపల్లి టౌన్, నవంబరు 29 : ఇక్కడి లక్ష్మీదేవిపేట రైల్వేగేటు సమీపంలో ఆదివారం తెల్లవారుజామున రైలు ఢీకొని గుర్తు తెలియని వ్యక్తి మృతి చెందినట్టు జీఆర్పీ దువ్వాడ ఎస్ఐ భుజంగరావు తెలిపారు. సుమారు 35 ఏళ్ల వయస్సు గల వ్యక్తి పట్టాలు దాటే సమ యంలో ఈ ఘటన జరిగి ఉండవచ్చునని అభిప్రాయపడ్డారు. మృతదేహాన్ని ఎన్టీఆర్ వైద్యాలయంలోని మార్చూరీలో భద్రపరిచామని, ఎవరైనా గుర్తిస్తే దువ్వాడ జీఆర్పీ కార్యాల యానికి సమాచారం అందించాలని కోరారు.