పెళ్లి ఇష్టం లేక యువతి ఆత్మహత్య
ABN , First Publish Date - 2020-06-07T07:11:41+05:30 IST
పెళ్లి చేసుకోవటం ఇష్టంలేక మండలంలోని బసవనపల్లికి చెందిన జేసీ త్రివేణి(22) పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నట్లు ఏఎస్ఐ రమణ శనివారం తెలిపారు.
అమరాపురం, జూన్ 6: పెళ్లి చేసుకోవటం ఇష్టంలేక మండలంలోని బసవనపల్లికి చెందిన జేసీ త్రివేణి(22) పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నట్లు ఏఎస్ఐ రమణ శనివారం తెలిపారు. గ్రామానికి చెందిన రంగారెడ్డి కుమార్తె త్రివేణి కర్ణాటక రాష్ట్రం తుమకూరు యూనివర్శిటీలో పీజీ చదువుతోంది. ఇంటిలో పెళ్లి సంబంధాలు చూస్తున్నారు. పెళ్లి చేసుకోవటం ఇష్టం లేక ఇంటిలో ఎవరూలేని సమయంలో పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నట్లు తెలిపారు. మృతురాలి తండ్రి రంగారెడ్డి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని, దర్యాప్తు చేస్తున్నట్లు ఏఎస్ఐ తెలిపారు.