పెళ్లి కాకుండా తల్లులు అవుతున్న వారి సంఖ్య పెరిగిపోతోందట.. ఆ రాష్ట్రంలో ఆశ్చర్యకర పరిణామం..!

ABN , First Publish Date - 2021-12-28T20:57:08+05:30 IST

మైనారిటీ తీరని బాలికతో ఆమె ఇష్ట ప్రకారమే శృంగారంలో పాల్గొన్నా అది అత్యాచారం కిందకే వస్తుందని చట్టం చెబుతోంది.

పెళ్లి కాకుండా తల్లులు అవుతున్న వారి సంఖ్య పెరిగిపోతోందట.. ఆ రాష్ట్రంలో ఆశ్చర్యకర పరిణామం..!

మైనారిటీ తీరని బాలికతో ఆమె ఇష్ట ప్రకారమే శృంగారంలో పాల్గొన్నా అది అత్యాచారం కిందకే వస్తుందని చట్టం చెబుతోంది. నిందితులను శిక్షించేందుకు పోక్సో చట్టం కూడా రూపొందింది. అయినా మహారాష్ట్రలోని కొన్ని జిల్లాల్లో మైనర్ బాలికలు అత్యాచారాలకు గురవుతున్నారు. చిన్న వయసులోనే గర్భం దాలుస్తున్నారు. 


18 ఏళ్ల కంటే తక్కువ వయసులోనే చాలా మంది బాలికలు తల్లులుగా మారుతున్నారట. అలాగే వివాహం చేసుకోకుండా తల్లులుగా మారుతున్న వారి సంఖ్య కూడా పెరుగుతోందట. తాజాగా మహారాష్ట్ర అసెంబ్లీలో ఎమ్మెల్యేలు భర్తి లావేకర్, సందీప్ ధ్రువే ఈ అంశాన్ని లేవనెత్తారు. వారు సమర్పించిన సెప్టెంబర్-2021 సర్వే వివరాల ప్రకారం.. మహారాష్ట్రలోని గిరిజన ప్రాంతాల్లో గతేడాది మైనర్ గర్భవతులు సంఖ్య 15 శాతం పెరిగిందట. 


గతేడాది యవత్మల్ జిల్లాలో 72 మంది యువతులు పెళ్లిల్లు కాకుండానే తల్లులుగా మారారట. వారిలో 19 శాతం మంది మైనర్ బాలికలేనట. అలాగే మోఖడా, జవహర్ ప్రాంతాల్లో గతేడాది 131 మంది మైనర్ బాలికలు తల్లులు అయ్యారట. ఇవి అధికారిక లెక్కలు మాత్రమేనని, అనధికారికంగా ఈ లెక్క మరింత ఎక్కువగా ఉండొచ్చని ఎమ్మెల్యేలు తెలిపారు. 

Updated Date - 2021-12-28T20:57:08+05:30 IST