జీడిపల్లి రిజర్వాయర్లో గుర్తు తెలియని శవం
ABN , First Publish Date - 2021-01-21T07:48:13+05:30 IST
మండల పరిధిలోని జీడిపల్లి రిజర్వాయర్లో బుధవారం గుర్తు తెలియని, దాదాపు 40 ఏళ్ల వయసున్న వ్యక్తి శవం లభ్యమైంది
బెళుగుప్ప, జనవరి 20: మండల పరిధిలోని జీడిపల్లి రిజర్వాయర్లో బుధవారం గుర్తు తెలియని, దాదాపు 40 ఏళ్ల వయసున్న వ్యక్తి శవం లభ్యమైంది. ఉదయం కాలువ వద్ద శవం ఉండగా జాలర్లు గమ నించి అధికారులకు సమాచారం మందించారు. వీఆర్ఓ ఎర్రిస్వామి, ఫిర్యాదు చేయడంతో ఎస్ఐ శ్రీనివాస్ అక్కడికి చేరుకుని, పరిశీలించారు. మృతుడు మూడు చొక్కాలు వేసుకుని ఉన్నాడు. మతిస్థిమితం లేని వ్యక్తి అయి ఉంటాడని పోలీసులు భావిస్తున్నారు. కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు. ఎవరైనా తెలిసి ఉంటే పోలీస్ స్టేషన్కు సమాచారం అందించాలని కోరారు.