ప్రయాణికుల్లాగా ఆటో ఎక్కి.. ఈ దుండగులు ఏం చేశారో చూడండి..!

ABN , First Publish Date - 2022-05-05T17:05:39+05:30 IST

ప్రయాణికుల్లాగా ఆటో ఎక్కి.. ఈ దుండగులు ఏం చేశారో చూడండి..!

ప్రయాణికుల్లాగా ఆటో ఎక్కి.. ఈ దుండగులు ఏం చేశారో చూడండి..!

  • డ్రైవర్‌పై దాడి
  • రూ. 20 వేలు, ఫోన్‌ చోరీ
  •  

హైదరాబాద్ సిటీ/హయత్‌నగర్‌ : ప్రయాణికుల్లాగా ఆటో ఎక్కిన దుండగులు డ్రైవర్‌ను చితకబాది సెల్‌ఫోన్‌, రూ. 20 వేలు లాక్కొని పారిపోయారు. ఈ ఘటన హయత్‌నగర్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో జరిగింది. మునగనూర్‌ బ్యాంక్‌ కాలనీలో నివసిస్తున్న హరిప్రసాద్‌ ఆటోడ్రైవర్‌. మంగళవారం రాత్రి 11.30 గంటలకు ఇంటికి వెళ్తున్నాడు. హయత్‌నగర్‌ బస్టాండ్‌లో ఇద్దరు వేచి ఉన్నారు. రంగనాయకులగుట్ట సమీపంలోగల గోపీకృష్ణ టెంపుల వద్దకు వెళ్లాలని అడగగా.. వారిని హరిప్రసాద్‌ ఆటో ఎక్కించుకున్నాడు. దేవాలయం వద్దకు వెళ్లగానే ఓ వ్యక్తి ఆటో దిగాడు. హరిప్రసాద్‌ డబ్బులు అడుగుతుండగా ఆటోలో కూర్చున్న మరో వ్యక్తి వెనుక నుంచి డ్రైవర్‌పై దాడిచేశాడు. దుండగులు ఇద్దరూ హరిప్రసాద్‌ను తీవ్రంగా కొట్టి అతడి వద్ద ఉన్న నగదు, సెల్‌ఫోన్‌ లాక్కొని పారిపోయారు. బాధితుడి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

Read more