కృష్ణానగర్లో గుర్తుతెలియని యువకుడి హత్య
ABN , First Publish Date - 2020-09-12T12:05:34+05:30 IST
గుర్తుతెలియని యువకుడు దారుణ హత్యకు గురయ్యాడు.
హైదరాబాద్/బంజారాహిల్స్ : గుర్తుతెలియని యువకుడు దారుణ హత్యకు గురయ్యాడు. సట్టా ఆటలో చోటుచేసుకున్న వివాదంలో సదరు యువకుడిని కొందరు గుర్తుతెలియని వ్యక్తులు హత్యచేసినట్లు తెలిసింది. ఘటనకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి. కృష్ణానగర్ మెట్రో పిల్లర్ వద్ద రక్తపు మడుగులో ఓ యువకుడు పడి ఉన్నట్లు పోలీసులకు సమాచారం అందింది.
ఘటనా స్థలానికెళ్లి మృతదేహాన్ని పరిశీలించగా శరీరం, ఛాతి, కడుపులో కత్తిపోట్లు ఉన్నట్లు గుర్తించారు. మృతుడి వయస్సు సుమారు 25 నుంచి 28 ఏళ్ల లోపు ఉంటుందని, అడ్డా కూలీగా పనిచేసే వ్యక్తి కావచ్చని పోలీసులు తెలిపారు. మృతదేహం ఉన్న కొద్ది దూరంలో ప్రతిరోజూ సాయంత్రం అడ్డాకూలీలు మద్యం తాగి రాత్రివేళ సట్టా ఆడుతుంటారు. శుక్రవారం రాత్రి సట్టా ఆడుతున్న సమయంలో వివాదం జరగడంతో హత్య జరిగి ఉండవచ్చని భావిస్తున్నారు. జూబ్లీహిల్స్ పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.