రైలు ఢీకొని గుర్తు తెలియని వ్యక్తి మృతి
ABN , First Publish Date - 2021-11-30T05:48:43+05:30 IST
భీమడోలు రైల్వేస్టేషన్ సమీపంలో రైలు ఢీకొని గుర్తు తెలియని వ్యక్తి మృతి చెందాడు.
భీమడోలు, నవంబరు 29 : భీమడోలు రైల్వేస్టేషన్ సమీపంలో రైలు ఢీకొని గుర్తు తెలియని వ్యక్తి మృతి చెందాడు. ఏలూరు రైల్వే హెడ్ కానిస్టేబుల్ ఆదినారాయణ తెలిపిన వివరాల ప్రకారం సోమవారం తెల్లవారుజామున రైలెక్కేందుకు వచ్చిన వ్యక్తి కాలకృత్యాలు తీర్చుకునేందుకు ప్లాట్ఫారం చివరకు వెళ్ళి ట్రాక్ దాటుతుండగా గుర్తు తెలియని రైలు ఢీకొంది. ఈ ప్రమాదంలో ఆ వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడి వయస్సు 45–50 ఏళ్ల మధ్య ఉంటుందని, 5.5 అడుగుల పొడవు, ఎరుపు రంగు టీ షర్టు, సిమెంటు రంగు ప్యాంటు ధరించి ఉన్నాడని, మృతుడి సమాచారం తెలిసిన వారు 80740 55378 నంబర్కు సమాచారం అందించాలని హెడ్ కానిస్టేబుల్ సూచించారు.
రైలు ఢీకొని ట్రాక్మన్ దుర్మరణం
ఉంగుటూరు, నవంబరు 29: సోమవారం తెల్లవారుజామున ప్రమాదవ శాత్తు రైలు ఢీకొని ట్రాక్మన్ మృతి చెందాడు. ఉంగుటూరు మండలంలో ఉంగుటూరు రైల్వే స్టేషన్ దాటిన తర్వాత ట్రాక్ను పరిశీలిస్తున్న సమయంలో తిరుమల ఎక్స్ప్రెస్ ఢీకొని అశోక్ కుమార్ (28) దుర్మరణం పాలయ్యాడు. మృతుడిది విశాఖ జిల్లా భీమిలి.