75 ఏళ్ల మెమరీ లాస్ పేషెంట్పై అత్యాచారం!
ABN , First Publish Date - 2020-08-05T04:13:53+05:30 IST
75 ఏళ్ల వృద్ధురాలిపై అత్యాచారానికి పాల్పడ్డాడో కామాంధుడు. ఈ ఘటన కేరళలోని ఎర్నాకులంలో కోలెంచెరి ప్రాంతంలో జరిగింది.
కోలెంచెరీ: 75 ఏళ్ల వృద్ధురాలిపై అత్యాచారానికి పాల్పడ్డాడో కామాంధుడు. ఈ ఘటన కేరళలోని ఎర్నాకులంలో కోలెంచెరి ప్రాంతంలో జరిగింది. బాధితురాలు చాలాకాలంగా మెమరీ లాస్తో బాధపడుతోందని తెలుస్తోంది. ఆమె మర్మాంగాలు, శరీరంలోని కొన్ని ప్రాంతాలు బాగా దెబ్బతిన్నాయని వైద్యులు వెల్లడించారు. ఈ ఘాతుకానికి పాల్పడిన వ్యక్తి ఎవరో తెలియరాలేదు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. నిందితుడి కోసం గాలిస్తున్నామని చెప్పారు.