గోదావరిలో గుర్తు తెలియని శవం లభ్యం

ABN , First Publish Date - 2020-11-25T05:21:41+05:30 IST

గోదావరిలో గుర్తు తెలియని శవం లభ్యం

గోదావరిలో గుర్తు తెలియని శవం లభ్యం
గోదావరిలో తేలుతున్న శవం

లక్ష్మణచాంద, నవంబరు 24 : మండలంలోని పార్‌పెల్లి గ్రామ సమీపంలోని గోదావరి రేవు వద్ద గుర్తు తెలి యని శవం దొరికినట్లు ఎస్సై యూనిస్‌ అహ్మద్‌ అలీ తెలిపారు.  ఆయన తెలిపిన వివరాల ప్రకారం గ్రామా నికి చెందిన గంటసాల సుబ్బరాజు అనేక వ్యక్తి రోజు వారి కార్యక్రమంలో భాగంగా మంగళవారం ఉదయం చేపలు పట్టడానికి గోదావరి నదికి వెళ్లాడు. ఈ క్రమంలో గోదావరి ఒడ్డున 50 సంవత్సరాల వయస్సు గల వ్యక్తి శవం కనిపించింది. దీంతో ఆయన గ్రామ స్తులకు సమాచారం ఇచ్చి పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలి పారు. శవంపై బ్లూ కలర్‌ డ్రాయర్‌, తెలుపు బనియన్‌ ఉన్నట్లు తెలిపారు. 

Updated Date - 2020-11-25T05:21:41+05:30 IST