అన్యాయంగా తొలగించారు

ABN , First Publish Date - 2021-04-13T05:06:12+05:30 IST

వలంటీర్‌గా విధులు నిర్వహిస్తున్న తనను అన్యాయంగా తొలగించారని మునిసిపాలిటీ పరిధి మాదిగ వీధి సచివాలయ 15వ వార్డు వలంటీర్‌ తామరాపల్లి రాజ్యలక్ష్మి ఆవేదన వ్యక్తంచేశారు. వలంటీర్ల అవా ర్డుల ప్రదానోత్సవానికి సోమవారం రాజాం వచ్చిన స్పీకర్‌ తమ్మినేని సీతారాంను ఆమె కలిసి తన ఆవేదనను వ్యక్తంచేశారు.

అన్యాయంగా తొలగించారు

 స్పీకర్‌ ఎదుట ఆవేదన వ్యక్తంచేసిన వలంటీర్‌

రాజాం రూరల్‌, ఏప్రిల్‌ 12: వలంటీర్‌గా విధులు నిర్వహిస్తున్న తనను అన్యాయంగా తొలగించారని మునిసిపాలిటీ పరిధి మాదిగ వీధి సచివాలయ 15వ వార్డు వలంటీర్‌ తామరాపల్లి రాజ్యలక్ష్మి ఆవేదన వ్యక్తంచేశారు. వలంటీర్ల అవా ర్డుల ప్రదానోత్సవానికి సోమవారం రాజాం వచ్చిన స్పీకర్‌ తమ్మినేని సీతారాంను ఆమె కలిసి తన ఆవేదనను వ్యక్తంచేశారు. ఇంటింటికి వెళ్లి పింఛన్లు ఇవ్వ కుండా పింఛన్‌దారులను వార్డు సచివాలయానికి రప్పించి పింఛన్ల పంపిణీని తాను వ్యతిరేకించానని ఆ ఫిర్యాదులో పేర్కొన్నారు. దీంతో సచివాలయ సిబ్బంది తాను సక్ర మంగా విధులు నిర్వహించడం లేదని తనపై తప్పుడు ఫిర్యాదులు చేశారని ఆరో పించారు. తనకు న్యాయం చేయాలని కోరారు. దీనిపై స్పందించిన స్పీకర్‌ కలెక్టర్‌తో మాట్లాడి తగు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. 

 

Updated Date - 2021-04-13T05:06:12+05:30 IST