బ్రిటన్లో 44,650కి చేరిన కోవిడ్-19 మృతుల సంఖ్య!
ABN , First Publish Date - 2020-07-11T14:10:24+05:30 IST
ప్రపంచవ్యాప్తంగా కరోనా అంతకంతకూ విజృంభిస్తోంది. బ్రిటన్లో కొత్తగా కోవిడ్-19 కారణంగా మరో 48 మంది మృత్యువాత పడ్డారు. దీంతో బ్రిటన్లో మొత్తం కరోనా మరణాల సంఖ్య 44,650కు చేరుకుంది.
లండన్: ప్రపంచవ్యాప్తంగా కరోనా అంతకంతకూ విజృంభిస్తోంది. బ్రిటన్లో కొత్తగా కోవిడ్-19 కారణంగా మరో 48 మంది మృత్యువాత పడ్డారు. దీంతో బ్రిటన్లో మొత్తం కరోనా మరణాల సంఖ్య 44,650కు చేరుకుంది. బ్రిటీష్ డిపార్ట్మెంట్ ఆఫ్ హెల్త్ అండ్ సోషల్ కేర్ తెలిపిన వివరాల ప్రకారం బ్రిటన్లో ప్రస్తుతం 2,88,133 మంది కరోనాతో బాధపడుతున్నారు. ప్రభుత్వ సైంటిఫిక్ అడ్వైజరీ గ్రూప్ ఫర్ ఎమర్జెన్సీ వెల్లడించిన గణాంకాల ప్రకారం కోవిడ్-19 సోకినవారి సంఖ్య ఇంగ్లాండ్లో ఈ వారంలో 0.8 నుంచి 1.0 శాతానికి పెరిగింది. ఇంగ్లాండ్లో లాక్డౌన్ సడలింపుల కారణంగా ప్రజలు పబ్బులు, బార్లు రెస్టారెంట్లకు వస్తుండటంతో కరోనా కేసులు పెరుగుతున్నాయనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.