కరోనా బారిన కేంద్రమంత్రి నిత్యానంద రాయ్

ABN , First Publish Date - 2022-01-06T21:55:57+05:30 IST

కేంద్రమంత్రి నిత్యానంద రాయ్ కరోనా బారినపడ్డారు. 56 ఏళ్ల రాయ్ బీహార్ నుంచి లోక్‌సభకు ప్రాతినిధ్యం

కరోనా బారిన కేంద్రమంత్రి నిత్యానంద రాయ్

న్యూఢిల్లీ: కేంద్రమంత్రి నిత్యానంద రాయ్ కరోనా బారినపడ్డారు.  56 ఏళ్ల రాయ్ బీహార్ నుంచి లోక్‌సభకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. హోంమంత్రిత్వ శాఖ వ్యవహారాల సహాయ మంత్రిగా ఉన్నారు. తనకు కరోనా సోకిన విషయాన్ని మంత్రి ట్విట్టర్ ద్వారా తెలియజేశారు.


తనకు వైరస్ సంక్రమించిందని, నిర్ధారణ కాగానే సెల్ఫ్ ఐసోలేషన్‌లోకి వెళ్లినట్టు చెప్పారు. తనను కలిసిన అందరూ తగు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని కోరారు. కాగా, బుధవారం మంత్రి సెంట్రల్ ఆర్మ్‌డ్ రిజర్వు పోలీస్ ఫోర్స్‌ సిబ్బందికి ఆయుష్మాన్ హెల్త్ కార్డులు పంపిణీ చేశారు.   

Updated Date - 2022-01-06T21:55:57+05:30 IST