తెలంగాణ ప్రభుత్వంపై కేంద్రమంత్రి ఎల్‌.మురుగన్‌ ఫైర్‌

ABN , First Publish Date - 2022-04-18T01:49:11+05:30 IST

తెలంగాణ ప్రభుత్వంపై కేంద్రమంత్రి ఎల్‌.మురుగన్‌ మండిపడ్డారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ కేంద్ర పథకాలు రాష్ట్రంలో

తెలంగాణ ప్రభుత్వంపై కేంద్రమంత్రి ఎల్‌.మురుగన్‌ ఫైర్‌

కరీంనగర్: తెలంగాణ ప్రభుత్వంపై కేంద్రమంత్రి ఎల్‌.మురుగన్‌ మండిపడ్డారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ కేంద్ర పథకాలు రాష్ట్రంలో అమలు కావడం లేదని విమర్శించారు. ప్రాణహిత పుష్కరాల ఏర్పాట్లలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందని దుయ్యబట్టారు. పొరుగునే ఉన్న మహారాష్ట్ర 10 కోట్లు కేటాయించి భక్తుల సౌకర్యం కోసం ఏర్పాట్లు చేస్తే ఇక్కడ మాత్రం ఎటువంటి సదుపాయాలు లేవన్నారు. 12 ఏళ్లకొకసారి వచ్చే పుష్కరాలను భక్తులు ఎంతో పవిత్రంగా భావిస్తారని అన్నారు. భక్తుల మనోభావాలతో ప్రభుత్వం ఆడుకోవటం సరికాదన్నారు. హిందువుల పండుగలను రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోవడం లేదని తప్పుబట్టారు. రైతుల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని ప్రవేశపెట్ని ఫసల్‌ బీమా యోజనను రాష్ట్ర ప్రభుత్వం  పట్టించుకోక పోవడం శోచనీయమన్నారు. 

Updated Date - 2022-04-18T01:49:11+05:30 IST