రైతుల కోసం కేంద్రం లక్ష కోట్లు ఖర్చు చేసింది: మురళీధరన్
ABN , First Publish Date - 2022-04-11T21:09:28+05:30 IST
ఏడేళ్లలో తెలంగాణ రైతుల కోసం..కేంద్రం లక్ష కోట్లు ఖర్చు చేసిందని కేంద్రమంత్రి మురళీధరన్ అన్నారు.
హైదరాబాద్: ఏడేళ్లలో తెలంగాణ రైతుల కోసం కేంద్రం లక్ష కోట్లు ఖర్చు చేసిందని కేంద్రమంత్రి మురళీధరన్ అన్నారు. రైతుల న్యాయమైన డిమాండ్ల కోసం దీక్ష చేస్తారన్నారు.నీళ్లు లేకుంటే ధాన్యం ఉత్పత్తి కష్టమన్నారు. రైస్ మిల్లర్ల యజమానులతో టీఆర్ఎస్ నేతలు..ఒప్పందం కుదుర్చుకున్నారని చెప్పారు. కల్వకుంట్ల చంద్రశేఖర్రావు కాదు.. కరప్షన్రావు, కమీషన్రావు అని మురళీధరన్ సెటైర్లు వేశారు.