అల్లూరి జయంతి ఉత్సవాలు దేశవ్యాప్తంగా నిర్వహిస్తాం: Kishan reddy
ABN , First Publish Date - 2022-07-04T17:29:20+05:30 IST
అల్లూరి సీతారామారాజు జయంతి ఉత్సవాలు దేశవ్యాప్తంగా నిర్వహిస్తామని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ప్రకటించారు.
పశ్చిమగోదావరి: అల్లూరి సీతారామారాజు (Alluri sitaramaraju) జయంతి ఉత్సవాలు దేశవ్యాప్తంగా నిర్వహిస్తామని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి (Kishanreddy) ప్రకటించారు. అల్లూరి విగ్రహావిష్కరణ సందర్భంగా భీమవరంలోని పెదఅమిరంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో కేంద్రమంత్రి మాట్లాడుతూ... స్వాతంత్య్రం కోసం అనేక మంది పోరాటం చేశారని... వారి చరిత్ర నేటి తరానికి తెలియాలన్నారు. అల్లూరి సంచరించిన ప్రాంతాలను పర్యాటక ప్రాంతాలుగా అభివృద్ధి చేస్తామని చెప్పారు. అల్లూరి సీతారామరాజు, ఆయన అనుచరుల కుటుంబాలను కలుస్తామని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి పేర్కొన్నారు.