Bonalu: బోనాల ఉత్సవాలు తెలంగాణ ప్రజలకు ప్రత్యేకం: కిషన్రెడ్డి
ABN , First Publish Date - 2022-07-17T17:23:55+05:30 IST
బోనాల ఉత్సవాలు తెలంగాణ ప్రజలకు ప్రత్యేకమని కేంద్రమంత్రి కిషన్రెడ్డి (Union Minister Kishan Reddy) తెలిపారు.
హైదరాబాద్: బోనాల ఉత్సవాలు తెలంగాణ ప్రజలకు ప్రత్యేకమని కేంద్రమంత్రి కిషన్రెడ్డి (Union Minister Kishan Reddy) తెలిపారు. లష్కర్ బోనాల (Lashkar Bonalu) మహోత్సవం ప్రారంభమైంది. ఈ సందర్భంగా సికింద్రాబాద్ (Secunderabad) మహంకాళి అమ్మవారిని కిషన్రెడ్డి దర్శించుకున్నారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ వర్షాలు కురిసి పంటలు పండాలని ఆకాంక్షించానని తెలిపారు. కరోనా పూర్తిగా తొలగిపోవాలని అమ్మవారిని ప్రార్థించానని, కరోనా పూర్తిగా తొలగిపోవాలని అమ్మవారిని ప్రార్థించానని కిషన్రెడ్డి పేర్కొన్నారు. సికింద్రాబాద్ ఉజ్జయినీ మహాకాళి అమ్మవారి ఆషాఢ బోనాల జాతరకు ఆలయం ముస్తాబయ్యింది. అమ్మవారి ఆలయాన్ని పూలు, తోరణాలు, విద్యుత్ దీపాలతో సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు. బోనాల జాతర సందర్భంగా రాష్ట్రంతో పాటు ఇతర రాష్ట్రాల నుంచి భక్తులు హాజరుకానున్న నేపథ్యంలో అన్ని ఏర్పాట్లు చేశారు.