కేంద్ర సాయం అందేలా చూడండి

ABN , First Publish Date - 2020-04-03T07:46:01+05:30 IST

లాక్‌డౌన్‌ నేపథ్యంలో నిరుపేదల కోసం కేంద్రం ప్రకటించిన సాయం.. తక్షణమే అందేలా చూడాలని కాంగ్రెస్‌ ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి కోరారు. ఈ విషయమై కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి...

కేంద్ర సాయం అందేలా చూడండి

కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డికి జీవన్‌రెడ్డి లేఖ


హైదరాబాద్‌, ఏపిల్ర్‌ 2(ఆంధ్రజ్యోతి): లాక్‌డౌన్‌ నేపథ్యంలో నిరుపేదల కోసం కేంద్రం ప్రకటించిన సాయం.. తక్షణమే అందేలా చూడాలని కాంగ్రెస్‌ ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి కోరారు. ఈ విషయమై కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి కిషన్‌రెడ్డి గురువారం ఆయన లేఖ రాశారు. ప్రజల్లో ఉన్న సందిగ్ధతను తొలగిస్తూ కేంద్రం ప్రకటించిన బియ్యం, పప్పు, వంటనూనె, నగదు పంపిణీని వెంటనే ప్రారంభించేలా చొరవ తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.

Updated Date - 2020-04-03T07:46:01+05:30 IST