పార్టీ పరిశీలకుడిగా బెంగళూరుకు కేంద్రమంత్రి కిషన్ రెడ్డి
ABN , First Publish Date - 2021-07-27T17:52:39+05:30 IST
కర్ణాటక కొత్త సీఎం ఎంపిక ప్రక్రియ ప్రారంభమైంది. కొత్త సీఎం ఎంపిక కోసం పార్టీ పరిశీలకుడిగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కాసేపట్లో బెంగళూరు వెళ్లనున్నారు.
హైదరాబాద్: కర్ణాటక కొత్త సీఎం ఎంపిక ప్రక్రియ ప్రారంభమైంది. కొత్త సీఎం ఎంపిక కోసం పార్టీ పరిశీలకుడిగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కాసేపట్లో బెంగళూరు వెళ్లనున్నారు. ఇవాళ సాయంత్రం సీఎల్పీ మీటింగ్ తర్వాత కొత్త సీఎం పేరును ప్రకటించే అవకాశం ఉంది.
ఇదిలా ఉంటే, కర్ణాటక సీఎం పదవికి యడియూరప్ప సోమవారం రాజీనామా చేసిన విషయం తెలిసిందే. తదుపరి సీఎంగా పలువురు ఎమ్మెల్యేలు, కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి, మాజీ మంత్రి సదానంద గౌడ పేర్లు వినిపిస్తున్నాయి. సీఎం పోస్టు తమకే ఇవ్వాలని బ్రాహ్మణ, పంచమశాలి లింగాయత్, దళిత సామాజిక వర్గాల నుంచి డిమాండ్లు వస్తున్నాయి.