తెలంగాణ ప్రజలు మార్పు కోరుకుంటున్నారు: కిషన్ రెడ్డి

ABN , First Publish Date - 2021-03-01T17:49:26+05:30 IST

పట్టభద్రుల ఎన్నికలను భ్రష్టుపట్టించడానికి.. టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ప్రయత్నిస్తోందని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. సోమవారం మహబూబ్‎నగర్‎లో ఆయన

తెలంగాణ ప్రజలు మార్పు కోరుకుంటున్నారు: కిషన్ రెడ్డి

మహబూబ్‌నగర్‌: పట్టభద్రుల ఎన్నికలను భ్రష్టుపట్టించడానికి.. టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ప్రయత్నిస్తోందని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. సోమవారం మహబూబ్‎నగర్‎లో ఆయన పర్యటించారు. పర్యటన అనంతరం కిషన్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ..టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చాక చట్టసభలు నిర్వీర్యం అయ్యాయని ఆరోపించారు. తెలంగాణ ప్రజలు మార్పుకోరుకుంటున్నారని, సీఎం కేసీఆర్ కు అభద్రతాభావం పెరిగిందని విమర్శించారు. హైదరాబాద్‎లో గత జీహెచ్ఎంసీ ఎన్నికల్లో టీఆర్ఎస్‎, బీజేపీకి కేవలం ఎనిమిది వేల ఓట్లు మాత్రమే తేడా అన్నారు. కానీ ఇప్పుడు జరిగే ఎన్నికలు మేధావుల ఎన్నికలని..ఇలాంటి ఎన్నికల్లో ఎప్పుడూ మేధావుల ఆశీస్సులతో బీజేపీ గెలుస్తుందని జోస్యం చెప్పారు.

Updated Date - 2021-03-01T17:49:26+05:30 IST